Sunday, December 25, 2011

క్విట్ ఇండియా ఉద్యమం.

జనరల్ స్టడీస్
ఉద్యమ సమీక్ష: ఉద్యమ పరమోద్దేశ్యమైన పూర్ణ స్వరాజ్‌ను ఉద్యమం సాధించలేకపోయింది.
1.
ఉద్యమ గమనం కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీసింది. ఉద్యమ వైఫల్యం ముఖ్యంగా కార్మిక కర్షక వర్గాలను గొప్పగా నిరాశపరిచింది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఈ వర్గాలు ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ప్రయత్నించాయి. ఫలితంగానే రైతాంగం కేవలం తనదైన అఖిల భారత కిసాన్ మహాసభను ఏర్పరుచుకోగలిగింది.
2.
కార్మిక వర్గాలలోను కాంగ్రెస్ పట్ల నిరాసక్తత ఉద్యమ వైఫల్యంవల్ల చోటు చేసుకుంది. కార్మిక సంస్థలు ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లపై కాంగ్రెస్ తన పట్టును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యమ వైఫల్యం వల్ల ఎఐటియుసిలో కాంగ్రెస్ స్థానంలో కమ్యూనిస్టులు బలపడ్డారు.
సహాయ నిరాకరణోద్యమం వైఫల్యం ఏవిధంగానైతే స్వరాజ్ పార్టీ ఆవిర్భావానికి దారి తీసిందో శాసనోల్లంఘటన ఉద్యమ వైఫల్యం కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఆవిర్భావానికి కారణమైంది. ఉద్యమ వైఫల్యంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ వాదులు ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ్, అచ్యుత పట్వర్ధన్ మరియు అరుణా అసఫలీలు 1934 బాంబే సమావేశంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించారు.
ఉద్యమం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయినప్పటికీ ప్రతికూల ఫలితాలనిచ్చినప్పటికీ కొంతమేరకు చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది.
ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ ఒక పరిపూర్ణ ప్రజా విప్లవ సంస్థగా అవతరించింది. ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ పంథాలోనే స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది. స్వయం పరిపాలన, స్వదేశీ స్థానంలో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యానికి పిలుపునిచ్చింది.
ఉద్యమంలో సహాయ నిరాకరణకు బదులు శాసనోల్లంఘనచోటుచేసుకోవడంతో కాంగ్రెస్ పోరాట పంథాలోనే స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది.
స్వదేశీ వనరులు, స్థానికులకు ఉపకరించాలనే వాదాన్ని ఉద్యమం సమర్ధవంతంగా తమ ఉప్పు సత్యాగ్రహాలలో చాటి చెప్పగలిగింది. స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారిగా స్ర్తిలు చైతన్యవంతమైన పాత్రను పోషించడానికి మరియు ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ఉద్యమం తోడ్పడింది. స్వాతంత్రోద్యమ భావాలు సరిహద్దు ప్రాంతాలైన ఆఫ్గనిస్తాన్‌లోకి ప్రవేశించడానికి కూడా ఉద్యమమే కారణమైంది.
ఉద్యమం తన తక్షణాశయాలను సాధించడంలో విఫలమైనప్పటికీ ఒక దశానుక్రమంగా మరియు క్రమానుగతంగా కాంగ్రెస్ బలపడడానికి తోడ్పడిందని చెప్పవచ్చు.
క్విట్ ఇండియా ఉద్యమం
స్వాతంత్రోద్యమంలో చిట్టచివరి ఉద్యముమ. గొప్ప విశిష్టతను సంతరించుకున్నది. పోరాటంలో నాయకత్వం లేని ఉద్యమంగా ఇది ప్రారంభమైంది. అహింసా వాదియైన గాంధీ ఒక అరాచక వాదిగా మారడానికి ఉద్యమం కారణమైంది.
ఉద్యమానికి దారి తీసిన కారణాలు: ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులు 2 ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ముడిపడి ఉన్నాయి. 1939లో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాలతో సంప్రదించకుండానే గవర్నర్ జనరల్ లిన్ లిత్‌గో భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామురాలిగా చేస్తూ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యాయి. రాజకీయాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. యుద్ధ నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించినందుకుగాను ఏమి ప్రతిఫలంగా ఇవ్వబోతున్నారో చెప్పకుండానే భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వాములు చేయడం,పైగా అత్యంత కీలక రక్షణ శాఖను భారతీయులకు ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అభ్యంతరకరమైంది.
1940
ఆగస్టు ప్రతిపాదనల్లో గవర్నర్ జనరల్ లిన్‌లిత్‌గో రక్షణ శాఖ తప్పించి మిగిలిన శాఖలను ఇవ్వడానికి అంగీకరించడం, యుద్ధానంతరం అధినివేశ ప్రతిపత్తి కల్పించడానికి మరియు రాజ్యాంగ నిర్మాణ సమితి ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీని నిరాశపరచడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలను తిరస్కరించింది. భారత రాజకీయాలలో నెలకొని ఉన్న పరిస్థితి గాంధీకి ఒక నైతిక సమస్యగా పరిణమించింది. తనను తాను రక్షించుకోలేని ఇంగ్లండ్ కనీసం భారతదేశాన్ని రక్షించుకునే బాధ్యతను భారతీయులకు ఇవ్వకపోవడం గాంధీని కలవరపరిచింది. ఈ స్థితిలో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్య వాదము గణనీయంగా విస్తరించింది. ఆసియాలో ఇంగ్లండ్ వలసలైన ఇండోనేషియా, మలయా ద్వీపములు మరియు సింగపూర్‌ను జపాన్ ఆక్రమించింది. భారతదేశం కూడా బ్రిటిష్ వారి వలస కనుక దాడి తప్పదని హెచ్చరించింది. పైగా విశాఖపట్నం రేవు పట్టణాలపై దాడికి పాల్పడింది. జపాన్ దురాక్రమణ జరిగితే భారతదేశ పరిస్థితి ఏమవుతుందో అనేది కాంగ్రెస్‌కు సమస్యగా పరిణమించింది.
1942
మార్చి 24న వచ్చిన క్రిప్స్ రాయబారము భారతీయ నాయకత్వాన్ని నిరాశపరిచింది. 1940 ఆగస్టు ప్రతిపాదనల్ని పునరుద్ఘాటించిన క్రిప్స్ సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తూ మైనారిటీ ముస్లింలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికార ముందని ప్రకటించాడు. పరోక్షంగా పాకిస్తాన్ అన్న ఆలోచనకు మద్దతు పలికాడు. తీవ్ర నిరాశకు గురైన గాంధీ ప్రతిపాదనలను దివాళా తీసిన బ్యాంకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్స్‌గా విమర్శించాడు. పరిష్కార మార్గంగా ఉద్యమానికి సిద్ధమైనాడు.
ఉద్యమానికి ఇతర కారణాలు కూడా తోడ్పడ్డాయి.
1.
ప్రపంచ యుద్ధం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. కార్మిక వర్గాల్లో అశాంతి నెలకొన్నది
2.
యుద్ధ సమయంలో అధికార రహస్యాల చట్టాన్ని ప్రయోగించి మానవ హక్కులు హరించివేయబడ్డాయి.



 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...