Thursday, September 6, 2012

డిగ్రీ చదువు మధ్యలో ఉన్నవాళ్లు, ఒక సంవత్సరం ముందునుంచే ప్రణాళికా ప్రకారం సన్నద్ధమైతే సక్సెస్‌

ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఫారెస్ట్‌ ఆఫీసర్‌, సిబిఐ, ఇంటలిజెన్స్‌...మొదలైన ఉద్యోగాల్లో స్థిరపడాలని ఎంతోమంది కలలు కంటారు. నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో భారీగా ఖాళీలు ఏర్పడతాయి. కానీ వాటన్నింంటినీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయరు. ప్రమోషన్స్‌, డిప్యూటేషన్‌ లేదా అబ్సార్షన్‌..వంటి పద్ధతుల్లో అనుభవం గల ఆఫీసర్లకు పోస్టింగ్స్‌ ఇస్తారు. నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం పొందాలంటే మిగిలింది డైరెక్ట్‌ రిక్రూట్‌మెంటే ! యూనియన్‌ పబ్లిక సర్వీస్‌ కమిషన్‌, స్టాటికల్‌, ఎకనామికల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో నెగ్గటమొక్కటే కేంద్ర కొలువుకు దారి. ప్రతి ఏటా నిర్దిష్ట సమయంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్‌ లేదా సాధారణ డిగ్రీ చదువుతో ఈ పరీక్షలకు హాజరుకావొచ్చు. డిగ్రీ చదువు మధ్యలో ఉన్నవాళ్లు, ఒక సంవత్సరం ముందునుంచే ప్రణాళికా ప్రకారం సన్నద్ధమైతే సక్సెస్‌కు దగ్గరవుతారు. కేంద్ర స్థాయిలో జరిగే పలు పరీక్షలు రెండు విధాలుగా నిర్వహిస్తున్నారు. మొదటిది పోటీ పరీక్షలు. రెండోది ఎంపిక (సెలక్షన్‌) పద్ధతి.
ఆయా పోటీ పరీక్షలు, వాటి లక్ష్యం మొదలైన వివరాలు...
* సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ, మెయిన్స్‌)
* ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌
* కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌
* ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌
* ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీసెస్‌
* కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌
* సెంట్రల్‌ పోలీస్‌ సర్వీసెస్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ నియామకాలు)
* డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్స్‌ (గ్రేడ్‌ బి,ఐ-సెక్షన్‌) ఆఫీసర్లు/ స్టెనోగ్రాఫర్స్‌ నియామకాలు)
* జియాలజిస్ట్‌ ఎగ్జామ్‌
* నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీ ఎగ్జామ్స్‌ (ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జరుగుతాయి)
* స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌ (రెండేళ్లకొకమారు జరుగుతుంది)
రెండో పద్ధతి : ఎంపిక పద్ధతిలో నేరుగా నియామకాలు జరుగుతాయి. కేంద్రంలోని గ్రూప్‌-ఎ, ఎంపిక చేసిన గ్రూప్‌-బి పోస్టులకు ఈ పద్ధతి పాటిస్తారు. ఇందులో పోస్టుకు అవసరమైన అర్హతలు కలిగినవారిని ఉన్నత విద్యార్హత, అనుభవం ఆధారంగా ఎంపిక చేపడతారు.
వెబ్‌సైట్‌ : www.upsc.gov.in 
ఎస్‌ఎస్‌సి : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి)... కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ కార్యాలయాల్లోని రూ.10,500, అంతకంటే తక్కువ వేతన పరిధి కలిగిన గ్రూప్‌-బి పోస్టులకు, గ్రూప్‌-సి లోని అన్ని నాన్‌-టెక్నికల్‌ పోస్టులకు పోటీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
సివిల్స్‌ : దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని సరైన రీతిలో నడిపించాలని గట్టిగా కోరుకునేవారికి సివిల్‌ సర్వీసెస్‌ మంచి మార్గం. యుపిఎస్‌సి నిర్వహించే అత్యంత కఠినమైన, విస్త్రత పరీక్ష సివిల్‌ సర్వీసెస్‌. ఈ పరీక్ష రాసేవారికి ముందుగా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అయితే ప్రస్తుత సంవత్సరానికి పరీక్ష పాత పద్థతిలోనే కొనసాగుతుంది. అభ్యర్థులు ప్రధానంగా ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌, ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌, వాటి తర్వాత సర్వీసులైన గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి సర్వీసులలో ప్రవేశానికి సివిల్స్‌ పరీక్ష రాస్తారు.
మూడు దశలు : ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ...ఇలా మూడు దశల్లో సివిల్‌ పరీక్ష జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష ప్రతి సంవత్సరం సాధారణంగా మే 3వ వారంలో జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్‌ పరీక్ష. అనంతరం పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. సివిల్స్‌ను జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు నాలుగుసార్లు మాత్రమే రాసేందుకు అనుమతిస్తారు.
అర్హత : భారతీయుడై ఉండి, కనీసం ఏదైనీ డిగ్రీ పాసై ఉండాలి.
ఫీజు : రూ.50 సింగిల్‌ సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ స్టాంప్‌ (పోస్టాఫీసుల్లో లభ్యమవుతాయి) ద్వారా చెల్లించాలి.
ప్రిలిమినరీ : ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 150 మార్కులకు జనరల్‌ స్టడీస్‌, 300 మార్కులకు ఆప్షనల్‌ పేపర్‌లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు గంటలు సమయం. మెయిన్స్‌కు అభ్యర్థులను వడకట్టటమే ప్రిలిమ్స్‌ ప్రధానోద్దేశం. ఆ ఏడాది అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్యకు సుమారు 12 నుంచి 13 రేట్ల మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. ఆప్షనల్‌కు సంబంధించి ప్రిలిమ్స్‌కు జాబితాలో ఇచ్చిన 23 సబ్జెక్టుల్లో ఏదేని ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. జనరల్‌ స్డడీస్‌ పేపర్‌లో జనరల్‌సైన్స్‌, కరెంట్‌ ఈవెంట్స్‌ (జాతీయ, అంతర్జాతీయ అంశాలు), భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం, భారత, ప్రపంచ భౌగోళిక శాస్త్రం, భారత రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మెంటల్‌ ఎబిలిటిలపై ప్రశ్నలుంటాయి.
మెయిన్స్‌ : మెయిన్స్‌లో మొత్తం 9 పేపర్లుంటాయి. అన్నీ వ్యాసరూప పద్ధతిలో రాయాలి. ప్రతి పేపర్‌కూ మూడు గంటల సమయం కేటాయిస్తారు.
ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌ : అగ్రికల్చర్‌, యానిమల్‌ హజ్బెండ్రీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎటక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, జాగ్రఫీ, జియాలజీ, ఇండియన్‌ హిస్టరీ, లా, గణితం, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెడికల్‌ సైన్స్‌, ఫిలాసఫీ, ఫిజిక్స్‌, పొలిటకల్‌ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, స్టాటిస్టిక్స్‌, జువాలజీ, ఆంత్రోపాలజీ, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ, హిస్టరీ, మేనేజ్‌మెంట్‌, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, కింది భాషా సాహిత్యాల్లో ఏదేని ఒకటి-అరబిక్‌, అస్సామీ, బోడో, బెంగాలి, చైనీస్‌, డొగ్రి, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, గుజరాతి, హిందీ, కన్నడ, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మళయాళం, మణిపురి, మరాఠి, నేపాలి, ఒరియా, పాలి, పర్షియన్‌, పంజాబి, రష్యన్‌, సంస్కృతం, సంతాలి, సింధి, తమిళ్‌, తెలుగు, ఉర్దూ.
మెయిన్స్‌ పేపర్లు : 1.పేపర్‌-1 రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన ఏదేని ఒక భారతీయ భాష (300 మార్కులు)
2.పేపర్‌-2-ఇంగ్లీష్‌ (300 మార్కులు)
3.పేపర్‌-3-ఎస్సే (200 మార్కులు)
4.పేపర్‌-4,5-జనరల్‌ స్డడీస్‌ (ఒక్కో పేపర్‌కు 300 మార్కులు)
5.పేపర్‌-6,7,8,9 పైన తెలిసిన ఆప్షనల్‌ జాబితాలోని అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఏవేని రెండు సబ్జెక్టులు (ప్రతి సబ్జెక్టుకూ రెండు పేపర్లు. ఒక్కో పేపర్‌కు 300 మార్కులు)
అనుమతి లేని కాంబినేషన్లు : 1.పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ -పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
2.కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ-మేనేజ్‌మెంట్‌
3.ఆంత్రోపాలజీ-సోషియాలజీ
4.మ్యాథమెటిక్స్‌-స్టాటిస్టిక్స్‌
5.అగ్రికల్చర్‌-యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌
6.మేనేజ్‌మెంట్‌-పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
7.ఇక ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో...సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ వీటిలో ఒకటి కంటె ఎక్కువ సబ్జెక్టులను ఎంపిక చేసుకోరాదు.
8.యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌-మెడికల్‌ సైన్స్‌
ఇంటర్వ్యూ : దీనికి 300 మార్కులు. ఇందులో ఎంపిక చేసుకున్న ఆప్షనల్‌ సబ్జెక్టుపై అభ్యర్థి అవగాహన, ప్రాముఖ్యత కలిగిన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు, వ్యక్తిగత అభిరుచులను అంచనా వేస్తారు.

Saturday, May 5, 2012

2011 సివిల్స్ ద్వారా 910 మంది ఎంపిక..

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం నాడు విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో అమ్మాయిలే ప్రథమ, ద్వితీయస్థానాల్లో నిలవడం విశేషం. ఏఐఐఎంఎస్‌లో మెడిసిన్‌ చదివిన స్నేహా అగర్వాల్‌ జాతీయస్థాయిలో ప్రథమస్థానం కైవసం చేసుకుంది. ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఎం.ఏ చదివిన రుక్మిణి రియార్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రిన్స్‌ ధావన్‌ మూడో ర్యాంక్‌ సాధించాడు. 2011 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా మొత్తం 910 మంది కేంద్ర సర్వీసులకు ఎంపికవగా వారిలో 195 మంది మహిళలున్నారు. 420 మంది జనరల్‌, 255 బీసీ, 157 ఎస్‌సీ, 78 మంది ఎస్టీ కేటగిరి కింద ఎంపికయ్యారు.

కృష్ణభాస్కర్‌కు రాష్ట్రంలో ప్రథమ స్థానం
ఈ ఫలితాల్లో కృష్ణభాస్కర్‌ ఆలిండియా 9వ ర్యాంకు, రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించాడు. కృష్ణ భాస్కర్‌ సోదరుడు పార్ధసారధి భాస్కర్‌ 373వ ర్యాంకు సాధించాడు. వీరిద్దరూ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీపార్థసారధి భాస్కర్‌ కుమారులు.

Sunday, April 22, 2012

మీలో సివిల్స్ పట్ల ఆసక్తి ఉందా?

                            యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష అనంతరం మెయిన్స్‌లో విజయాన్ని సాధించడం అంత తేలికైన వ్యవహారం కాదు. తక్కువ సంఖ్యలో ఖాళీలు, నాణ్యత ఉన్న అభ్యర్థుల మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా సాగే రాత పరీక్ష పోటీ, అభ్యర్థి అంతరంగాన్ని అన్ని కోణాల నుంచి పసిగట్టే పర్సనాలిటీ టెస్ట్ వీటన్నింటినీ తట్టుకొని విజేతల జాబితాలో చోటును సాధించడం ఆషామాషీ కాదు. విజయవంతమైన ప్రణాళిక, సడలిపోని ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసే వాతావరణం, చక్కగా సూటిగా విషయంలోకి వెళ్ళిపోయే మంచి స్టడీ మెటీరియల్ ఇవన్నీ సివిల్స్ విజయానికి అభ్యర్థి వేసుకోవాల్సిన పునాదిరాళ్ళు, సివిల్ సర్వీస్ పరీక్షలు మూడు దశల్లో ఉంటాయని తెలిసిందే. వాటిలో మొదటిదశ ప్రిలిమినరీ. ఒక అభ్యర్థి తన కెరీర్‌లో సివిల్స్ కోసం యత్నిస్తున్నప్పుడు మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ పాస్ కావడం మంచిది. మొదటిసారి మెయిన్స్ పరీక్షాపత్రాన్ని రాసే అనుభవం చేతికి అందుతుంది. ఎంతమంది బోధించినా, మనం రాస్తే వచ్చిన అనుభూతి రాదు. ప్రథమ పర్యాయంతోనే సివిల్స్ సర్వీస్‌లో విజేతలుగా నిలిచేందుకు అవకాశాలు తక్కువే కావచ్చుగాక, కానీ ప్రిలిమినరీ పాసయ్యేందుకు మాత్రం అభ్యర్థి తప్పకుండా పోరాటం చేయాలి. ముందే చెప్పినట్టు దీనివల్ల మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది. ఇకపోతే, త్వరలో జరుగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్ని మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు కొన్ని ప్రత్యేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవ రాహిత్యంవల్ల మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు పొరపాట్లు చేయకుండా ఈ అంశాలు పనికొస్తాయి. వీటికన్నా ముందు, అసలు, అభ్యర్థి తనకు సివిల్స్‌పై నిజమైన ఆసక్తి వుందా లేదా అన్నది తేల్చుకోవాలి. ఆసక్తిలేకుండా ఊరికే రాస్తూపోవడం శుద్ధ దండుగ.

అభ్యర్థికి సదరు పోటీ పరీక్షపై ఆసక్తి ఉందా? లేదా అన్నది ఈ క్రింది ప్రశ్నల ద్వారా స్పష్టమవుతుంది.
* మీకు సివిల్ సర్వీస్ పరీక్షలు ఏ పద్ధతిలో జరుగుతాయో తెలుసా?
* సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తున్న వారినెవరినైనా కలిశారా?
* సివిల్ పోటీలో ఘనవిజయాన్ని సాధించిన అభ్యర్థుల వివరాలు చదివారా?
* సివిల్స్‌కు అవసరమైన కార్యప్రణాళికను రూపొందించుకున్నారా?
* సివిల్స్‌కు సంబంధించిన మెటీరియల్‌ను సమకూర్చుకుంటున్నారా?
పై ఐదు ప్రశ్నల్లో దేనికీ జవాబు చెప్పలేని అభ్యర్థి రంగంలో ఉన్నా లాభం లేదు. ఎందుకంటే గుంపులో గోవిందా అన్నట్టు తానూ ఓ అప్లికేషన్ పారేశాడు కానీ సివిల్స్ అంటే ప్రాథమిక అవగాహన కూడా లేదన్నమాట. ఆ స్థాయి వ్యక్తులు సివిల్స్ సాధించగలగడం కలలోమాట.
ప్రశ్నల్లో కొన్నింటికైనా సంతృప్తికరంగా సమాధానాలు చెప్పగలిగిన వారు మరింత వేగంగా విజృంభించాలి. అన్ని ప్రశ్నలకు సరిగ్గా జవాబులు చెబుతున్న అభ్యర్థి సివిల్స్ పోటీలో క్రమేపీ రాటు దేలగలడు - సందేహం లేదు. ఇప్పుడు విశే్లషించుకున్నట్టుగా, పై రెండు తరగతుల వారికీ మధ్య ఒక విభజన రేఖ ఉంటుంది. ఈ ప్రశ్నలు అందుకు ఉపయోగపడతాయి.
* మీరు దినపత్రికలు, ఇతర ఉపయోగకరమైన మేగజైన్స్‌ను చదువుతున్నారా?
* టీవీలో కరెంట్ అఫైర్స్ క్రమం తప్పకుండా చూస్తున్నారా?
* బిబిసి వింటున్నారా?
* యోజన, కురుక్షేత్ర వంటి పత్రికలు చదువుతున్నారా?
* ఏదైనా క్లిష్టమైన జాతీయ లేదా అంతర్జాతీయ సంఘటనపై చిన్న వ్యాఖ్యను వెంటనే రాయగలరా?
* ఇరాన్ - అమెరికా సంక్షోభంవంటి ఒక సుదీర్ఘమైన అంశంలో ఇమిడివున్న తేదీలు, వాటి వివరాలు, ప్రముఖుల కొటేషన్సు తిరిగి చెప్పగలరా?
పై ప్రశ్నల్లో అన్నింటికీ సరిగ్గా జవాబులు చెబితే ఇక ఆ అభ్యర్థి చివరి అవకాశంలోనైనా సివిల్స్ విజేతల జాబితాలో చేరిపోతాడు.
వీటికి సరిగ్గా జవాబులు చెప్పలేని వారు పోటీలో కొంత వెనుకబడి వున్నారని తెలుసుకోవాలి.
సమాచార సేకరణ: ప్రిలిమినరీ మొదటిసారి రాసే అభ్యర్థులకు పరీక్ష విధానంపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అదనపు సమాచారం కోసం వీళ్ళంతా పాకులాడుతారు. సీనియర్ల సలహాలు తీసుకుంటారు. అయితే వీటికి కూడా కొంత పరిమితి కావాలి. సమాచార సేకరణ మాత్రమే లక్ష్యంగా మారితే అది అభ్యర్థి విలువైన సమయాన్ని నిలువునా తినేస్తుంది. అలాగని మెళుకువలు తెలియకపోవడం మంచిది కాదు. అయితే సివిల్స్‌పై సకల అంశాన్ని డిగ్రీలో తెలుసుకోవడం మంచిది. అదీ కాకుంటే ప్రిలిమ్స్‌కన్నా కొద్ది నెలల ముందే సేకరణను మానుకోవాలి. ఎందుకంటే సీనియర్లు, నిపుణుల సలహాలు అన్నీ ఒకే దశలో ఉండవు. ఎక్కువ సలహాలతో అభ్యర్థి ఒరిజినల్ ఆలోచనా ధోరణి సైతం మరుగున పడే ప్రమాదం ఉంది. కొద్దిమంది నిపుణుల సూచనల్ని సీరియస్‌గా అభ్యర్థి, మిగతా అటెంప్ట్‌లలో కూడా వాటినే పాటించడం మంచిది.
స్థాయిని అంచనా వేసుకోవడం: తనపై తాను విశ్వాసం లేనివాడు ఎందుకు కొరగాడు. మరీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నా అది సమయానికి విషమ ఫలితాలనిస్తుంది. అందువల్ల వాస్తవికాధారంగా అభ్యర్థి తనను తాను అంచనా వేసుకోవాలి. మిగతా అభ్యర్థులు ఏ స్థాయిలో ఉన్నారో నిర్మాణాత్మకంగా అంచనా వేసుకోవాలి. తన బలహీనతల్ని గుర్తించాలి. కొద్దిమందికి ప్రిలిమినరీలో జనరల్ సైన్స్ విభాగమంటేనే భయం. మరికొందరు లెక్కలంటే ఆదుర్దాపడతారు. జాగ్రఫీ మరికొద్దిమందికి విసుగును తెప్పిస్తుంది. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అయితే అభ్యర్థి తనకు ఫలానా సబ్జెక్టుపై వున్న అయిష్టాన్ని ముద్రగా మలచుకోకూడదు. దాన్ని సాధించే దాకా విడిచిపెట్టకూడదన్న పట్టుదల చాకచక్యం - ఈ రెండింటితో కలగలిపి పయనించాలి. బాగా ఇష్టమయ్యే అంశాలపై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే అది అసలుకే ఎసరుగా మారుతుంది. మరోమాట, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌కన్నా పెద్ద ప్రాముఖ్యత ఆప్షనల్స్‌కు వుంటుంది. దీన్ని అభ్యర్థులు మొదటినుంచి గుర్తుంచుకోవాలి.
సమయానికి తగిన వ్యూహం: విజేతలుగా నిలచిన అభ్యర్థులంతా వివిధ పత్రికలకిచ్చే ఇంటర్‌వ్యూల్లో ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను చదవాలని సలహా ఇస్తుంటారు. దీనిలో వంద శాతం నిజముంది. అయితే విజేతల సలహాల్ని అభ్యర్థులంతా తు.చ. తప్పకుండా అనుసరించాలని ఏమీ లేదు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఎంతో విస్తృతమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇది అందరూ ఒప్పుకునేదే. అయితే పరీక్షకు ప్రిపేరయ్యేందుకు తక్కువ సమయం మాత్రమే ఉన్నప్పుడు ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇలాంటి వేళల్లో అభ్యర్థులు సమయానికి అనుగుణంగా తగు వ్యూహాల్ని తయారుచేసుకోవాలి. కొద్ది రోజుల్లో పరీక్ష ఉన్నప్పుడు నాణ్యమైన జనరల్ స్టడీస్ పుస్తకాలు చదవడంవల్ల మంచి ప్రయోజనాలుంటాయి. దాన్ని కూడా ఎంపిక చేసుకొని చదివితే మరీ మంచిది. ఎంపిక ప్రక్రియకూడా గుడ్డిగా రాయి విసరడం వంటిది కాదు. దీనికో శాస్ర్తియమైన విధానముంటుంది. గత కొద్ది సంవత్సరాల్లో జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల ప్రశ్నాపత్రాల్ని అభ్యర్థి ముందు పెట్టుకోవాలి. ఏఏ విభాగాలనుంచి ఎలాంటి తీరుతెన్నులతో ప్రశ్నల్ని అడుగుతున్నారని మదింపు వేసుకోవాలి. అదే దారిలో తానూ పయనించాలి.
మానసిక స్థిరత్వం: ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ముందుకు సాగేవారు జీవితంలో అద్భుతమైన విజయాల్ని సాధిస్తారు. సమకాలీన సమాజం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. అన్ని పోటీ పరీక్షలు వేరు. సివిల్స్ వేరు. అందువల్ల విజయాన్ని సాధించే అభ్యర్థి కఠినమైన మానసిక స్థిరత్వాన్ని సాధించేందుకు కృషిచేయాలి. ఇది చెబుతున్నంత సులువుకాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. సివిల్స్‌లో విఫలమైనంత మాత్రాన జీవితమంతా చీకటి మాయమైపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు. భయంకరమైన పరాజయానికి అభ్యర్థి తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలి. మానసిక స్థయిర్యం లోపిస్తే అభ్యర్థిలో అనవసరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి. ఇవి విజయపథంలో ముళ్లకంచెల్ని వేస్తాయి. అభ్యర్థికి పరీక్షలకన్నా ఎంతో ముందునుంచే ఎవరైనా తోడుగా ఉంటే మరీ మంచిది. అలాంటి వ్యక్తి నిరంతరం అభ్యర్థి వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉండాలి.
అభ్యర్థి ఎక్కడా నీరస పడిపోకుండా, నీరుకారి పోకుండా జాగ్రత్త వహించాలి. సివిల్స్‌లో నెగ్గిన అభ్యర్థులు తమ విజయానికి పరోక్ష కారణం కుటుంబం నుండి లభించిన ఆదరణేనని చెప్పడం వీరంతా గమనించే ఉంటారు.
సాంకేతిక దోషాలు: మొదటిసారి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు, ప్రశ్నపత్రం చివరన ఉండే సమాచారాన్ని భర్తీ చేయడంలో కొంత ఇబ్బంది పడతారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సాంకేతిక లోపాలేర్పడి ప్రశ్నపత్రం ఇన్‌వాలీడ్‌గా మారుతుంది. అహోరాత్రులు శ్రమించినదంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకని అభ్యర్థి సమాచార పత్రంలోని గళ్లను సూచనల్ని గమనిస్తూ నింపాలి. మరో అంశం. ప్రశ్నపత్రంలో కఠినంగా అనిపించే వాటిని చూసి అట్టే గాభరాపడకూడదు. ముందుగా, నిశ్చయంగా సరియైనవని తోచిన సమాధానాల్ని పూర్తిచేయాలి. వాటి సంఖ్యను మనసులో గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక రానివాటిని, మెల్లమెల్లగా సాధన చేస్తూ పోవాలి. ఇటీవలి కాలంలో ప్రిలిమనరీ ప్రశ్నల్ని చాలా చాకచక్యంగా రూపొందిస్తున్నారు. ప్రశ్నను అజాగ్రత్తగా చదివినా, సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, అంతే సంగతులు. ఇవీ ప్రిలిమినరీ పరీక్షకు సీరియస్‌గా ప్రిపేరవుతున్న సివిల్ అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రిలిమినరీ మొదటిసారికే క్లియర్ చేసుకుంటే మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
3ప్రాథమిక2 ప్రణాళిక ఎలా?: 2012 ప్రిలిమ్స్ పరీక్ష ప్రకటన ఫిబ్రవరి 4న వెలువడింది. నూతన విధానం ప్రవేశపెట్టాక గత ఏడాది జూన్ 12న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ)ని తొలిసారి నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సివిల్స్‌కు సిద్ధమవబోతున్నవారు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలో స్పష్టం చేసుకోవటానికి ఇదే తరుణం! విషయాలను స్థూలంగా ఆకళింపు చేసుకోవటంతోపాటు వాటిలోని సూక్ష్మ వివరాలను కూడా పట్టించుకోవాలి. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కొత్త విధానాన్ని విశే్లషిస్తే బోధపడే సారాంశమిది వచ్చే సంవత్సరం పరీక్షకు రూపొందించుకోవాల్సిన ప్రణాళిక తీరును. ఇప్పుడు చర్చిద్దాం. ఈ ప్రణాళికను 2 అంశాలుగా విభజించాలి.
 1. ఈ ఏడాది ప్రశ్నపత్రం ఫలితాలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక.
 2. సాధారణ కార్యాచరణ ప్రణాళిక.
నిర్దిష్టంగా... పర్యావరణంపై సమాచారం సేకరించాలి. ప్రాథమిక అంశాలను పట్టించుకోవాలి. పర్యావరణం అంటే ఏమిటి అనే ప్రశ్న దగ్గరనుంచి ప్రారంభించి వౌలిక విషయాలను గ్రహించాలి. పునాదిని పటిష్ఠ పరుచుకుని, తర్వాత ఈ విభాగంలో వర్తమాన అంశాలపై దృష్టి పెట్టాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వార్తలకెక్కిన ప్రతి సమాచారాన్ని సేకరించాలి. (ప్రాంతీయ సమాచారం అవసరం లేదు). ఈ అంశాలను ప్రాథమిక సమాచారానికి జోడించాలి. నిశజూజ్ఘ కూళ్ఘూ ఱ్య్యరీ నూ, సామాజిక రంగాలకు సంబంధించిన సాహిత్యాన్ని (్గఉది, బీహార్ నిర్మాణం మొదలైనవి) చదవాలి. ఒక్కో కార్యక్రమ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రారంభమయిందీ మొదలైనవి విస్మరించకూడదు. ఒకసారి ఈ సమాచారం నమోదు చేసుకున్నాక వర్తమాన అంశాలను జోడించటం మొదలుపెట్టాలి. ఈ సందర్భంగా ఓ బంగారు సూత్రం గుర్తుంచుకోవాలి. సామాన్య మానవుణ్ణి ప్రభావితం చేసే ఏదైనా సివిల్ సర్వెంట్లకు ముఖ్యమే!
* పాలిటీ, హిస్టరీ, సైన్స్ మొదలైన విభాగాల్లో అందరూ పాటించే సన్నద్ధతనే సాగించాలి.
* మీ ఇంగ్లిష్ భాషానైపుణ్యాలను అంచనా వేసుకోండి. అవసరమనుకుంటే వాటిని మెరుగుపరచుకోండి. ఇది కేవలం సాధన వల్లనే సాధ్యమవుతుందని గమనించాలి.
* ఇంటర్లో, డిగ్రీలో లెక్కలు సబ్జెక్టుగా గణితేతర విద్యార్థులు మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ విభాగాలపై దృష్టి పెట్టాలి.
* ఈ సంవత్సరం మాదిరే వచ్చే ఏడాది కూడా ప్రశ్నల సంఖ్యా, క్లిష్టత స్థాయి అదే రకంగా ఉండొచ్చని భావించకూడదు. మార్పులకు సిద్ధపడి ఉండటం మేలు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది... ఇక్కడ అవసరమైనది త్యీౄఒ ళకళ పజళతీ. ముఖ్యాంశాల్లో ప్రతి ఒక్క కోణాన్ని దగ్గరగా గమనించి, క్షేత్రస్థాయలో పరిశీలన చేయటం.
ప్రయత్నాలు, వయోపరిమితిలో మార్పులు
------------------------------------------------------
పరీక్ష సంవత్సరం వయోపరిమితి ప్రయత్నాల సంఖ్య
------------------------------------------------------
1949-60 21-24 పరిమితి లేదు
1961-71 21-24 రెండుసార్లు
1972 21-26 రెండుసార్లు
1979-1986 21-28 మూడుసార్లు
1987-1989 21-26 మూడుసార్లు
1990 21-31 నాలుగుసార్లు
1999-ఇప్పటివరకు 21-30 నాలుగుసార్లు


సివిల్స్ పరీక్షలో మార్పులు
--------------------------------------
సంవత్సరం మార్పులు
--------------------------------------
1947 తప్పనిసరి (కంపల్సరీ) సబ్జెక్టుల ప్రవేశం
1948 ప్రపంచ చరిత్ర,
అంతర్జాతీయ న్యాయం సబ్జెక్టుల చేరిక
1961 ఆప్షనల్ సబ్జెక్టుగా హిందీ ప్రవేశం
1966 ఆప్షనల్ సబ్జెక్టుల ప్రక్షాళన
1969 ఆధునిక భారతీయ
భాషల సాహిత్యం చేరిక
1979 ప్రిలిమ్స్ తొలిసారిగా ప్రవేశపెట్టారు
1987 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశం
1993 సబ్జెక్టుగా మెడికల్ సైన్స్ చేరిక

Friday, March 9, 2012

కూసంత అవగాహన ఉంటె చాలు సివిల్స్ కొట్టెయ్యొచ్చు.

సివిల్స్ ఔత్సాహికులు తమ విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా మొట్టమొదటిగా సమాజంలో జరుగుతున్న వాటిపై అవగాహన ఏర్పరచుకుని లోకజ్ఞానం పెంచుకోవాలి. దీనికోసం న్యూస్ ఛానల్స్, ఆల్ ఇండియా రేడియోలోని చర్చా కార్యక్రమాలు అనుసరించడం, దినపత్రికల్లోని ఎడిటోరియల్స్ చదవడం లాభిస్తుంది.
అదే విధంగా పుస్తకాల్లో చదివే అంశాలను సమాజంలోని పరిస్థితులతో అన్వయం చేసుకుంటే సులభంగా గుర్తుంటుంది. వీటితోపాటు సివిల్స్‌కు హాజరయ్యే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా అట్లాస్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. సివిల్స్ విషయంలో తార్కిక ఆలోచన నైపుణ్యం ఎంతో అవసరం దీన్ని పెంపొందించుకోవాలి. నేను తెలుగు మీడియంలో పరీక్ష రాశాను. అందువల్ల నాకు తెలియని సాంకేతిక పదాలకు అర్థాలు అన్వేషించి ఒక జాబితాగా రూపొందించుకున్నాను.
ఇక.. గత ఏడాది నుంచి ప్రారంభించిన రెండో పేపర్ (ఆప్టిట్యూడ్ టెస్ట్) ఇంజనీరింగ్, మ్యాథ్స్ అభ్యర్థులకే అనుకూలం అనే అపోహ వీడి చదవాలి. సిలబస్ విస్తృతంగా ఉందనే భయాన్ని వదిలి ఇష్టపడి చదవాలి. ఎన్ని గంటలు చదివామనేది? కాకుండా.. చదివిన కొద్ది సమయమైనా కాన్‌స్టెంట్‌గా, కాన్‌సన్‌ట్రేషన్‌తో చదవాలి.
---x-x-x-x---
 
ఆల్ ది బెస్ట్
-సీహెచ్‌వీఏ నాయుడు (ఐపీఎస్ ట్రైనీ),
సివిల్స్ 2010 విజేత
Courtesy:Sakshi

Wednesday, February 22, 2012

చూపు లేకున్నా ఫరువాలేదు కలెక్టర్ కావాలన్న పట్టుదల ఉంటే చాలు. నిదర్శనం ఇదే.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmgg4dQbueEWmdqtvFc7QNqC_YPJmVCNb-SUOJp84CXG5LqyBZR-C2d3mH2hZgz2Bh054Dd781Nn65RPZs24962XKtEwNhOGRTw-WSHkW70K93tJLcsV22xRvMDEdALCR4dtNkpGsq0Kw/s1600/IAS-blind-1-791056.jpg

సివిల్స్ సాధించండిలా!

 
దేశంలోనే అత్యుత్తమ సర్వీస్ సివిల్ సర్వీసు. సమాజంలో మమేకమై ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ అపారమైన సేవలందించాలనుకునే అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ వారధిలా నిలుస్తుంది. 
కార్యదీక్ష, కఠోర శ్రమ, సామాజిక, ఆర్థికాంశాలపై విస్తృతమైన అవగాహన, భారత రాజ్యాంగం తీరు తెన్నులు, తార్కిక విశే్లషణ, ఆలోచనా సామర్ధ్యం, నిర్ణాయక శక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్ష వరంలా నిలుస్తుంది. 
దేశంలోని వివిధ సర్వీసుల కింద ఉన్న అత్యుత్తమ ఉద్యోగాలకుగాను ఈ పరీక్షను నిర్వహిస్తారు. గత ఏడాది ఈ సర్వీసు కింద 880 మందిని ఎంపిక చేయగా ఆ సంఖ్య ప్రస్తుతం 1037కు పెరిగింది. సివిల్ సర్వీసెస్ కిందకు వచ్చే విభాగాలు :
* ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు 
* ఇండియన్ ఫారెన్ సర్వీసు 
* ఇండియన్ పోలీస్ సర్వీసు 
* ఇండియన్ పి అండ్ టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసు (గ్రూప్-ఏ) 
* ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐటి) (గ్రూప్-ఎ) 
* ఇండియన్ పోస్టల్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (గ్రూప్-ఎ, గ్రేడ్-3) 
* ఇండియన్ కార్పొరేట్ ‘లా’ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీసు (గ్రూప్-బి) 
* ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డయుడామన్, దాద్ర అండ్ నగర హవేలీ పోలీస్ సర్వీసు (గ్రూప్-బి) 
* పాండిచ్చేరి సివిల్ సర్వీసు (గ్రూప్-బి) 
* పాండిచ్చేరి పోలీస్ సర్వీసు (గ్రూప్-బి) 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంనుంచి బ్యాచిలర్స్ డిగ్రీ. డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మెయిన్ పరీక్ష దరఖాస్తు సమయం నాటికి అభ్యర్థులు సంబంధిత సర్ట్ఫికెట్ పొంది ఉండాలి. 
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా. వయోపరిమితి: ఈ పరీక్షకు హాజరు కాగోరు అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2012 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. 
దరఖాస్తు చేసే విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు: 50 రూపాయలు. చివరి తేదీ: మార్చి 5, 2012 పరీక్ష తేదీ: మే 20. 
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ 
పరీక్ష విధానం: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. రెండు పేపర్లలోను ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయి. 
పేపర్ 1: జనరల్ స్టడీస్, 200 మార్కులు 
పేపర్2: జనరల్ ఆప్టిట్యూడ్ 200 మార్కులు 
పేపర్-1 (సబ్జెక్టువారీ వెయిటేజి): 
కరెంట్ అఫైర్స్:4 ప్రశ్నలు 
హిస్టరీ:13 ప్రశ్నలు 
జాగ్రఫీ: 8 ప్రశ్నలు 
పాలిటీ: 14 ప్రశ్నలు 
ఎకానమీ: 22 ప్రశ్నలు 
ఎకాలజీ: 18 ప్రశ్నలు 
జనరల్ సైన్స్: 21 ప్రశ్నలు 
పేపర్-2 (సబ్జెక్టువారీ వెయిటేజి) 
కాంప్రహెన్షన్: 27 ప్రశ్నలు 
డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్: 8 ప్రశ్నలు 
జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ: 28 ప్రశ్నలు 
అనలిటికల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్: 8 ప్రశ్నలు 
ఇంగ్లీష్ లాంగ్వేజి కాంప్రహెన్షన్: 9 ప్రశ్నలు 
సిలబస్ 
కరెంట్ అఫైర్స్: చరిత్ర, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, ఎకాలజీ తదితర అంశాలపై పేపర్-1 ఉంటుంది. 
జనరల్ ఆప్టిట్యూడ్: ఇక పేపర్-2లో కాంప్రహెన్షన్, ఇంటర్ ప్రిటేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, ఇంగ్లీషు లాంగ్వేజి కాంప్రహెన్షన్ స్కిల్స్ తదితర అంశాలను పొందుపరచడం జరిగింది. 
ప్రిపరేషన్ ఇలా: కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి చోటుచేసుకున్న సంఘటనలు తాజా సమాచారంతోపాటు సంబంధిత నేపథ్యంపై పట్టు సాధించాలి. అలాగే జాతీయ ప్రభావం కలిగిన ప్రాంతీయ సంఘటనలపై కూడా దృష్టి సారించాలి. అలాగే సదస్సులు, సమావేశాల్లో విడుదల చేసిన డిక్లరేషన్లు వంటి టైటిళ్లు, ఇతర అన్ని రంగాలలో జరిగిన, జరుగుతున్న మార్పులు, సంఘటనలను ప్రతి అంశాన్నీ విడిచిపెట్టకుండా సాధన చేయాలి. 
రిఫరెన్స్ బుక్స్:
కాంపిటీషన్ విజర్డ్, కరెంట్ అఫైర్స్ పుస్తకాలు, యోజన, ఎకనమిక్ సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే. 
చదవాల్సిన పుస్తకాలు:
* ఎన్‌సిఈఆర్‌టి పుస్తకాలు 
* తెలుగు అకాడమీ చరిత్ర పుస్తకాలు 
* మోడ్రన్ ఇండియా-బిపిన్ చంద్ర 
* మిడీవల్ ఇండియా- సతీష్ చంద్ర 
* ఏనె్షంట్ ఇండియా-ఆర్.ఎస్.శర్మ 
* ఇండియన్ ఇయర్ బుక్ 
* ఇండియన్ పాలిటీ-లక్ష్మీకాంత్ 
* ఇండియన్ ఎకానమీ-మిశ్రా 
* ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్-ఎంఎల్‌జింగస్ 
* ఇండియన్ ఎకానమీ-దత్ 
* ఇండియన్ ఎకానమీ- కపిల ఉమ 
* ఎ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్ 
* అనలిటికల్ రీజనింగ్ 
* సైన్స్ రిపోర్టర్, వివిధ జాతీయ దినపత్రికల్లో వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు, విశేషాలు.
 ప్రిపరేషన్ ఇలా:
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి చాలా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఏది ముఖ్యమైనదో, ఏది ముఖ్యమైనది కాదో అర్ధం కాక అభ్యర్థులు ఇబ్బంది పడుతూంటారు. అందువల్ల గతంలో ఇచ్చిన సివిల్స్ ప్రశ్నా పత్రాలను సేకరించుకుని అందులో వచ్చిన మాదిరి ప్రశ్నలను అధ్యయనం చేయడం అవసరం. అలాగే జాతీయ ప్రభావం కలిగిన ప్రాంతీయ సంఘటనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఆయా సంఘటనల మూలాన్ని కూడా గమనించాలి. అలాగే కరెంట్ ఎఫైర్స్ కోసం అభ్యర్థులు ఎక్కడి వరకు సంఘటనలను కరెంట్ అఫైర్స్ కోసం చదవాలో తెలియక ఇబ్బంది పడతారు. అయితే పరీక్ష తేదీనుంచి ఒక ఏడాది ముందు కాలం వరకు సంఘటనలను తెలుసుకుంటే సరిపోతుంది. ఇక స్టాండర్డ్ జీకే విషయంలో తేదీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్దేశిత వరుస క్రమానికి ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కరెంట్ అఫైర్స్ అన్ని రంగాలలో చోటు చేసుకునుంటాయి. అందువల్ల ఆయా రంగాలలోని మూలాలనుంచి అంశాలను అధ్యయనం చేయడంవల్ల ఆ విషయ పరిజ్ఞానం, భవిష్యత్తులో జరగబోయే మెయిన్ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.
సలహాలు  సూచనలు:
*జీవ శాస్త్రంలో ప్రాధమిక విషయాలపై పట్టు సాధించిన అభ్యర్థులకే ఎకాలజీలో అంశాలు బాగా అర్ధమవుతాయి. ఈ విషయాన్ని గుర్తించి ఎకాలజీలోని అన్ని అంశాలను 8-12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టి పుస్తకాల ద్వారా అభ్యాసంచేయాలి. 
*ఇక ఎకానమీకి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టి పదకొండవ తరగతికి చెందిన 3ఇండియన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌తోపాటు తెలుగు అకాడమీకి చెందిన 3్భరత ఆర్థిక వ్యవస్థకు చెందిన పుస్తకాలు చదువుకోవాలి. వీటితోపాటు సిలబస్‌లో ఉన్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలాగే 3యోజన2, 3కురుక్షేత్ర2 వంటి మ్యాగజైన్లు చదువుకోవడం ఉపయుక్తం కాగలదు. 
*జనరల్ సైన్స్‌కు సంబంధించి అభ్యర్థులు ముఖ్యంగా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వంటి ప్రాధమిక సబ్జెక్టులతోపాటు టెక్నాలజీకి సంబంధించి అన్ని అంశాలను క్షుణ్ణంగా చదవాలి. సైన్స్ సబ్జెక్టులు చదవని అభ్యర్థులు సైన్సు సబ్జెక్టుని నిర్లక్ష్యం చేస్తారు. సైన్సు పదాలను గుర్తుంచుకోవడానికి ఇబ్బంది పడతారు. అయితే బేసిక్స్‌పై పట్టు సాధించినపుడే పదాలను గుర్తుంచుకోవడం సులభమవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఏ విభాగాన్నీ వదిలిపెట్టక పోవడం చాలా శ్రేయస్కరం కాగలదు. 
*పాలిటీ విషయంలో రాజ్య వ్యవస్థతోపాటు దానిని ప్రభావితం చేసే పాలనా యంత్రాంగంపై కనీస అవగాహన ఉండాలి. అలాగే ఈ విభాగంలో అడిగే ప్రశ్నలన్నీ సమకాలీన జాతీయ, అంతర్జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇస్తారని గ్రహించి, ఆ మేరకు చదువుకోవడం ఉత్తమం. 
* హిస్టరీకి సంబంధించి ఆధునిక చరిత్రపై ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యంగా జాతీయోద్యమం, దానికి సంబంధించిన అన్ని మూలాలను గురించి క్షుణ్ణంగా చదువుకోవాలి. అలాగే ఏనె్షంట్, మిడీవియల్ హిస్టరీకి చెందిన కళలు, సాహిత్యం, ఉద్యమాలు, రాజకీయ సామాజిక అంశాలకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. 
*జాగ్రఫీలో ప్రాధమిక అంశాలతోపాటు ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, విధానాలు, సమస్యలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో నెగ్గుకు రావడం తేలికేనని గుర్తించాలి. 
*అభ్యర్థుల్లో నిర్ణాయక శక్తిని, సమస్యను గుర్తించే లక్షణాన్ని డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో గమనిస్తారు. అలాగే తార్కికంగా విశే్లషించే సామర్ధ్యాన్ని లాజికల్ రీజనింగ్ విభాగంలో గమనిస్తారు. ఈ రెండు విభాగాలలో రాణించాలంటే గ్రాహణ శక్తి, సమయ స్పూర్తితోపాటు పర్సనల్ స్కిల్స్‌ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 
*అభ్యర్థులలోని మేథో సామర్ధ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఈ విభాగానికి సంబంధించి ఈక్వేషన్స్, రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, జామెట్రీ అండ్ మెన్సురేషన్, కౌంటింగ్ టెక్నిక్స్, ప్రాబబిలిటీ, నంబర్స్ లెటర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండర్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. 
*నిర్దేశిత విషయంపై అభ్యర్థికున్న అవగాహన ఏపాటిదో కాంప్రహెన్షన్ విభాగంలో నిర్ణయిస్తారు. ఈ విభాగంలో రాణించాలంటే క్రిటికల్ థింకింగ్ నాలెడ్జ్, ఇచ్చిన విషయంలో సారాంశాన్ని వెంటనే గుర్తించగలిగే నైపుణ్యం అవసరం. ఇంగ్లీషుపై ప్రాధమిక పరిజ్ఞానంతోపాటు వేగంగా చదివి అర్ధం చేసుకునే లక్షణాలుండాలి. 
*ఆయా అంశాలకు సంబంధించిన ప్రశ్నలు, జవాబులు రాబట్టేందుకు వేగం ఖచ్చితత్వం చాలా అవసరం. సబ్జెక్టుపై పట్టు, వీలైనన్ని మాక్ టెస్టులు చేయడంవల్ల ఆత్మవిశ్వాసం పెరిగి సమాధానాలు రాబట్టే ప్రక్రియలో వేగం పెరుగుతుంది. కనక నిరంతర అభ్యాసంతోనే వేగం, ఖచ్చితత్వం ఏర్పడతాయన్న విషయాన్ని గుర్తించి పరీక్షకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.

Saturday, February 4, 2012

సివిల్స్ నోటిఫికేషన్ 2012 విడుదల | UPSC Civils notification - 2012

ఇవాళ 2012 సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా షుమారు 1037 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పూర్తి నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ నొక్కి Download చేసుకోండి.  DOWNLOAD
తెలుగులో సివిల్స్ కు సంభందించిన వివరాలకు పూర్వపు టపాలు (POSTS) లో చూడగలరు. లేదా http://civilsintelugu.blogspot.in/2012/01/2012.html   
పైన తెలిపిన లింకులో చూడగలరు.
ఎలాఆప్ప్లై చేసుకోవాలి ?
http://www.upsconline.nic.in/   ఈ సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Friday, January 20, 2012

సివిల్స్ నోటిఫికేషన్ 2012.

  • సివిల్స్‌-2012
  • ప్రిలిమ్స్‌ నోటిఫికేషన్‌ : ఫిబ్రవరి 4, 2012
  • దరఖాస్తు గడువు తేదీ : మార్చి 5, 2012
  • పరీక్ష తేదీ : మే 20, 2012
  • మెయిన్స్‌ పరీక్ష : అక్టోబర్‌ 5, 2012 (21 రోజులు)
  • వెబ్‌సైట్‌ : www.upsc.gov.in
జాతీయ స్థాయిలో జరిగే సివిల్స్‌ సర్వీసెస్‌కున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. దేశాభివృద్ధిలో సమర్థులైన అధికారుల్ని అందించటం సివిల్స్‌ లక్ష్యం. తొలినాళ్లలో ఈ పరీక్షపై సరైన అవగాహన, మెటీరియల్‌ లభించిక మన రాష్ట్ర అభ్యర్థులు అవకాశాల్ని కోల్పోయారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కానీ విపరీతమైన పోటీ ఉంది. అంతకంటే మించి కఠినమైన పరీక్షగా అభ్యర్థిని పరీక్షిస్తోంది. అంతేగాక మంచి అకడమిక్‌ రికార్డ్‌ కలిగి ఉన్న అభ్యర్థులు సైతం కొన్ని అపోహల్లో మునిగిపోయారు. ఇంగ్లీష్‌ మీడియం అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తారన్నది కూడా అలాంటిదే. ఇది మాత్రం వాస్తవం కాదు. సివిల్స్‌ సాధించడానికి అకడమిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు, సాధించాలనే తపన ఉండాలి. సివిల్స్‌-2012 నోటిఫికేషన్‌ ఫిబ్రవరిలో విడుదల కానుంది. అలాగే మన ఎపిపిఎస్‌సి కూడా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలను లక్ష్యం చేసుకొని సాధన చేస్తే బాగుంటుంది. ఈ నేపథ్యంలో సివిల్స్‌ విధి విధానాలు, అభ్యర్థుల సందేహాల గురించి ఇక్కడ అందిస్తున్నాం...
ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌...తదితర 20కి పైగా కేంద్ర సర్వీసుల్లో అధికారుల్ని ఎంపిక చేసే ప్రక్రియే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. దీన్ని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్ట ఎంపిక విధానంగా ఈ పరీక్షకు పేరుంది. ఇందులో నెగ్గుకు రావాలంటే ముందుండాల్సింది...సహనం, నేర్పు.
సివిల్స్‌ ఔత్సాహికులకు ప్రథమంగా ఉండాల్సిన ప్రధాన లక్షణం సహనం. కారణం..దీని ఎంపిక ప్రక్రియే ఏడాదిపాటు ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఉండే ఈ ఎంపికలో ప్రిలిమ్స్‌ మే నెలలో జరుగుతుంది. చివరిదశ ఇంటర్వ్యూ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యేది ఆ తదుపరి సంవత్సరం మే లోనే. ఇంత సుదీర్ఘ ప్రక్రియలో కూడి ఉండే పరీక్ష సివిల్స్‌.
శిక్షణ ఒక్కటే సరిపోదు...
సివిల్స్‌ వంటి అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అభ్యర్థులకు మొదటగా తలెత్తే సందేహం కోచింగ్‌ గురించే. కోచింగ్‌ తీసుకుంటేనే విజయం సాధ్యమనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు కోచింగ్‌ తీసుకోకుండానే, కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్‌ తీసుకుని విజయం సాధించనవారున్నారు. సివిల్స్‌ 2009లో విజేతగా నిలిచిన దేవిరెడ్ది ప్రశాంత్‌రెడ్డి సొంత ప్రిపరేషన్‌తోనే సాధించారు.
ఇలా మరెందరో ఉన్నారు. కాబట్టి... కోచింగ్‌ అవసరం అని కచ్చితంగా చెప్పలేం. అయితే కోచింగ్‌ తీసుకోవడం మాత్రం కచ్చితంగా లాభిస్తుందని చెప్పొచ్చు. అభ్యర్థులు బలంగా ఉన్న సబ్జెక్టులకు సొంతంగా సిద్ధమై, బలహీనంగా ఉన్న సబ్జెక్టులకు కోచింగ్‌ తీసుకోవచ్చు. ఎక్కువమంది అభ్యర్థులు చేసేది ఇదే. అయితే కోచింగ్‌ వల్ల మంచి సహచరులు పరిచయమవుతారు. దానివల్ల బృంద చర్చలకు ఆస్కారం ఉంటుంది.
తెలుగు మీడియం సమస్య అవుతుందా !
సివిల్స్‌ అందుకునేందుకు కావాల్సిన పరిశ్రమ, సహనం ఉన్నవారికి ఏ మీడియమైనా ఒకటే. తెలుగు మీడియంలో సివిల్స్‌ రాసి విజేతలుగా ఎంపికైనవారెందరో ఉన్నారు. కష్టపడి చదవటమే సివిల్స్‌కు కావాల్సిన అర్హత. ఈ క్రమంలో మొదటిసారే విజయం సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది మూడుసార్లు పరాజితులై చివరిదైన నాలుగో అటెంప్ట్‌లో విజయం సాధించారు. ఇలాంటి వారిని ప్రేరణగా తీసుకోవాలి. రెండు, మూడుసార్లు పరాజయాలు పలకరించినా బెదరక రెట్టించిన ఉత్సాహంతో ఎగసే కెరటంలా చెలరేగాలి. కాకపోతే ఇంగ్లీష్‌లో మెటీరియల్‌ లభ్యత ఎక్కువ. ఒకప్పుడు తెలుగులో మెటీరియల్‌ కొన్ని సబ్జెక్టుల్లోనే లభించేది. ఇప్పుడు దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ మెటీరియల్‌ విరివిగా దొరుకుతుంది. ఇంగ్లీష్‌లో కొంచెం బలహీనంగా ఉన్న అభ్యర్థులు, ఇంగ్లీష్‌ మెటీరియల్‌తో సాధన చేయవచ్చు. తెలుగులోకి అనువదించుకుని మెటీరియల్‌ రూపొందించుకున్నా ఫరవాలేదు.
అకడమిక్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా ! లేకున్నా !
చాలామంది అకడమిక్‌ పరీక్షల్లో మంచి మార్కులు సాధించనవారు మాత్రమే పోటీ పరీక్షలని నెగ్గగలరని భావిస్తారు. ఇది అపోహ మాత్రమే. ఇలాంటి భావనలను మనుసునుంచి తుడిచివేయాలి.గతంలో సివిల్స్‌ సాధించనవారిలో చాలామంది అకడమిక్‌ పరీక్షలో సాధారణ మార్కులు పొందినవారే. కాబట్టి ఎక్కడ, ఏం చదివారు అనేదానికంటే సివిల్స్‌ దృక్కోణంలో ఒక అంశాన్ని ఎలా చదివారు, ఏం గ్రహించారు, చక్కని భావవ్యక్తీకరణ ఉందా ! సరిదిద్దుకోగల నేర్పు ఉందా ! అన్నది చూస్తారు. వీటిని సమాధానాల నుండి గ్రహిస్తారు.
అదనంగా ఇంకేంటంటే...
సివిల్స్‌ ఔత్సాహికులకు అకడమిక్స్‌కు అదనంగా కొన్ని సహజ లక్షణాలు ఉండాలి. అవి...చేసే పనిపట్ల ఇష్టం, పట్టుదల, ప్రణాళిక, పరిశ్రమ, అణుకువ, అంకితభావం, ఆత్మస్థైర్యం, ఆత్మ విమర్శ, ఏ విషయం చదివినా గ్రహించడంలో స్పష్టత, వ్యక్తీకరించడంలో సరళత, వివరించడంలో సంగ్రహత. ప్రతిరోజూ రేడియో వార్తలు వినడం, వివిధ దినపత్రికలను చదవడం, చదివినదానిపై ఆలోచించి సహచరులతో చర్చించడం, సామాజిక సమస్యల పట్ల సానుభూతితో స్పందించడం. నిజాయితీతో, నిర్భయంగా, నమ్రతతో చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగడం. వీటిని పెంపొందించుకుంటే భావి విజేతలుగా అవతరించొచ్చు.
ఇక అర్హతలేంటంటే... ( తెలిసిందే మళ్ళీ ఇంకోసారి కొత్తవారికోసం )
గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయో పరిమితి..ఆగస్టు 1, 2012 నాటికి 21-30 ఏళ్లు. బిసిలకు మూడేళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు.
ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులు వయోపరిమితికి లోబడి గరిష్టంగా నాలుగుసార్లు, ఓబిసిలు ఏడుసార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా రాయొచ్చు. అయితే ఈ మూడంచెల్లో (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూల్లో) ఎందులో విఫలమైనా మొదటి నుంచి ప్రస్థానం మొదలుపెట్టాలి. ఉదాహరణకు ఒక అభ్యర్థి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్యూలో విఫలమైతే...మళ్లీ ప్రిలిమ్స్‌ నుంచి రాయాలి. అంతేగాకుండా ప్రిలిమ్స్‌లో ఒక్క పేపర్‌కు హాజరైనా ఒక ప్రయత్నం చేసినట్టే. అత్యుత్తమ ప్రిపరేషన్‌ ఉందనుకుంటే రాయడం మంచిది.
గత దశాబ్ద కాలంగా సివిల్స్‌ ఫలితాలు, విజేతల అనుభవాలు పరిశీలిస్తే సివిల్స్‌ పరీక్ష అత్యున్నతమైనప్పటికీ...అందని ద్రాక్ష మాత్రం కాదు అని స్పష్టమవుతోంది. శాస్త్రీయంగా, ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే ఏ నేపథ్యం ఉన్న అభ్యర్థులైనా ఇందులో విజయం సాధించడం సులభమే. కనీసం ఒక సంవత్సరం పూర్తిస్థాయి ప్రిపరేషన్‌ మాత్రం తప్పనిసరి. ఇక మొదటిసారే విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఎందరో ఉన్నారు. సివిల్స్‌ పరీక్షను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు ప్రతి రోజూ రేడియో, దినపత్రికలు, టీవీల్లోని వార్తలు, చర్చలు, వాఖ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తుండాలి. వాటిపై విశ్లేషణలు చేయాలి. సమాజంలో జరిగే సంఘటనలను నిశితంగా గమనించాలి. మనోరమ ఇయర్‌బుక్‌, ఇండియా ఇయర్‌ బుక్‌, ఎన్‌సిఈఆర్‌టి 9-12 తరగతుల పుస్తకాల అధ్యయనంతో ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ శ్రీకారం చుట్టాలి.
ఆప్షనల్‌ ఎంపిక...
సివిల్స్‌ పరీక్ష క్రమంలో అత్యంత కీలక అంశం ఆప్షనల్స్‌ ఎంపిక. 2010 వరకు ప్రిలిమ్స్‌లో కూడా ఒక పేపర్‌ ఆప్షనల్‌గా ఉండేది కాబట్టి...చాలామంది అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటికీ కలిసొచ్చేలా ఎంచుకునే వీలుంది. కానీ 2011 నుంచి ప్రిలిమ్స్‌లో ఆప్షనల్‌ విధానానికి స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో ఆప్షనల్స్‌ ఎంపిక విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అభ్యర్థులు తాము చదివిన గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులాధారంగా మెయిన్స్‌లో ఆప్షనల్‌ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల అకడమిక్‌ స్థాయిలో పట్టున్న సబ్జెక్టులను ప్రిపేర్‌కావడంలో ఇబ్బంది ఎదురుకాదు. అయితే మూడేళ్ల డిగ్రీలో చదవని సబ్జెక్టులును సైతం ఆప్షనల్స్‌గా ఎంచుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే...మెయిన్స్‌ వ్యాసరూప సమాధానాలు రాయాల్సిన పరీక్ష. కాబట్టి బాగా పట్టున్న, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా రాయగల సబ్జెక్టులను ఎంచుకోవడం మంచిది. అంతేకాకుండా ఆ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్‌ లభ్యత, కోచింగ్‌ సదుపాయాలు మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అవసరమైతే అంతకు ముందు సివిల్స్‌ విజేతలను సంప్రదించి వారి గైడెన్స్‌ను కూడా తీసుకోవడం ఉత్తమం.
సెలక్షన్‌ విధానం : సివిల్స్‌లో ఎంపిక విధానం మూడంచెలుగా ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అనే మూడింట్లో అభ్యర్థులను పరీక్షిస్తారు.
ప్రిలిమ్స్‌ : ఈఏడాది నుంచి ప్రిలిమినరీ పరీక్ష తీరుతెన్నులు మారాయి. ఇంతకు ముందు వరకు జనరల్‌ స్టడీస్‌కు 150 మార్కులు, అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్‌ సబ్జెక్టుకు 300 మార్కులు ఉండేవి. 2011 నుంచి పేపర్‌-2 ఆప్షనల్‌ స్థానంలో ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ప్రారంభించారు. దీంతో పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌, పేపర్‌-2 ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు జరుగుతున్నాయి.
మెయిన్స్‌ : మొత్తం ఖాళీలను పరిగణించి...1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మొయిన్స్‌లో మొత్తం 9 పేపర్లుంటాయి. పేపర్‌-1 రీజనల్‌ లాంగ్వేజ్‌, పేపర్‌-2 ఇంగ్లీష్‌ కేవలం అర్హత కొరకే. వీటిల్లో సాధించిన మార్కులను ఇంటర్వ్యూ ఎంపికకు పరిగణలోకి తీసుకోరు. పేపర్‌-3 జనరల్‌ ఎస్సే, పేపర్‌-4, 5 జనరల్‌ స్టడీస్‌ ఉంటాయి. మిగతా నాలుగు పేపర్లు అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్స్‌ పేపర్లు. ఒక్కో ఆప్షనల్‌కు రెండు పేపర్లు ఉంటాయి. మెయిన్స్‌ పేపర్లన్నీ డిస్క్రిప్టీవ్‌ విధానంలోనే ఉంటాయి.
ఇంటర్వ్యూ : మెయిన్స్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో ఖాళీకి 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇది మూడొందల మార్కులకు జరుగుతుంది. చివరికు మోయిన్స్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను కలిపి మెరిట్‌ ప్రకారం ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
చదవాల్సిన పుస్తకాలు...
  • ఇండియా ఇయర్‌ బుక్‌, 
  • యోజన, 
  • ఎకనామిక్‌ సర్వే, 
  • ది హిందూ దినపత్రిక, 
  • ఇండియా పాలిటీ-లక్ష్మీకాంత్‌, 
  • ఇండియన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-ఆర్‌.కె.అరోరా, 
  • కానిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా-పిఎం.భక్షీ, 
  • ఏన్షియంట్‌ ఇండియన్‌ హిస్టరీ-ఆర్‌.ఎస్‌.శర్మ, 
  • మిడీవల్‌ ఇండియన్‌ హిస్టరీ-సతీష్‌ చంద్ర, 
  • మోడ్రన్‌ ఇండియన్‌ హిస్టరీ-బిపిన్‌ చంద్ర, 
  • మోడ్రన్‌ అప్రోచ్‌ టు వెర్బల్‌ రీజనింగ్‌-ఆర్‌.ఎస్‌.అగర్వాల్‌, 
  • అనలిటికల్‌ రీజనింగ్‌- పాండే, 
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-ఆర్‌.ఎస్‌.అగర్వాల్‌.

Wednesday, January 18, 2012

ఐ. ఎ. ఎస్. వైపే మ్రోగ్గు.

సమాజంలో ఉన్నతహోదా అంటే ఏ ఐఏఎస్సో. ఐఎఫ్‌ఎస్సో చదవాలన్న భావన నేటితరంలో బలంగా నాటుకుపోయిందన్నది వాస్తవం. ఆ దిశలోనే యువతరం సివిల్‌ సర్వీస్‌ల పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు రేయింబవళ్ళు పుస్తకాలతో కుస్తీ పడుతూనే ఉండటం గమనిస్తూనే ఉంటాం.
ఇందులో ఉత్తీర్ణులైన టాపర్లు సైతం ఐఎఫ్‌ఎస్‌ కన్నా ఐఎస్‌కే ప్రాధాన్యత ఇస్తుండటంతో దీని క్రేజీ మరీ పెరిగిపోతోందన్నది నిజం. అధికార దర్పంతో పాటు తక్కువ సమయంలోనే ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు, ఇన్నాళ్ళూ.. తానైతే ఇలా చేస్తానంటూ.. కలలు కన్న సమాజసేవ పనులు చేస్తూ మానసికంగా సంతృప్తి పొందటం ఒకటైతే.. అన్నింటికి మించి ఉద్యోగ భద్రత, సాంఘిక హోదా లభించే తీరు కూడా చాలా మేరకు ఐఏఎస్‌ వైపు ఆకర్షిస్తోందనటంలో సందేహం లేదు.
న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులు ఎన్ని తరహా న్యాయాలు చెప్పి ప్రజా హర్షాతిరేకాలు పొందినా.. జనం మధ్యకు రాలేరు. కానీ సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. నిత్యం జనం మధ్య తిరుగాడుతూ వారి సమస్యల పరిష్కారానికి రాజ్యాంగ పరంగా వందలాది పదవులను అనుభవించే అవకాశాలు బోలెడున్నాయి.
ఉద్యోగంలో చేరిన మరుక్షణం నుండి కనీసం మూడు దశాబ్దాల పాటు దేశ, రాష్ట్రపాలనా వ్యవస్థలలో అంతర్భాగమై దేశ భవిష్యత్‌ని నిర్దేశించే వినూత్న అవకాశం సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులదే అనటంలో సందేహం లేదెవ్వరికీ. ముఖ్యమంత్రి తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుండి ప్రధాని పదవి తరువాత ఉన్నత పదవిగా భావించే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి పదవి వరకు సివిల్‌ సర్వీసు ఉద్యోగులు ఎదిగే అవకాశాలున్నాయి.

సివిల్స్ అంటే ఎందుకు భయం.?

ప్రపంచంలోనే అతి క్లిష్టతరమైన  పరీక్షలలో ఒకటి "సివిల్స్". దేశంలోనే ప్రధానమంత్రి తర్వాత అత్యున్న స్థానానికి ఎదగడానికి దోహదపడే ఒకేఒక మార్గం ( రాజకీయ పరంగా కాకుండా ) సివిల్స్. 
 http://www.linkingsky.com/images/civil-services.jpg
సంవత్సరాలుగా రాసి రాసి విసుగేత్తక మళ్ళీ తమ పోరాట పటిమను చుపాలనుకునే అలుపెరుగని దీరుల ఆశాదీపిక ఈ సివిల్స్. పట్టా పొందిన కుర్రాడి నుండి చివరి చాన్స్ ఉన్న ఆశావాహుల వరకూ ఎంతో మందికి సివిల్స్ ఒక కలగానే మిగిలిపోతోంది. 
 సరైన మార్గం చూపే వారులేకనో, సమాచార లోపం వల్లనో , ఇంగ్లీషులో చదివే వాళ్ళే రాయొచ్చు అనే అపోహలవల్లనో, పుస్తకాల లభ్యత కొరవడడం వల్లనో, కోచింగ్ కోసం లక్షలు వెచ్చించాల్సి వస్తుందనో ఇంకా ఇతర కారణాల మనలో వల్లనో అనేకమంది ఈ సివిల్స్ పరీక్షను అందని ఆకాశం అని అనుకుంటున్నారు.
నేను కూడా "సాధించగలను" అనే ఒక్క నమ్మకం , ఆత్మ విశ్వాసం ఉంటే చాలు. IAS, IPS, IRS, IFS, ....  మీ వాకిట్లో వాలాల్సిందే.! నిజం.!  ప్రణాళికా బద్ధమైన ప్రిపరేషన్, వాడిపోని విశ్వాసం , కోరవడని కాంక్ష, అణగద్రోక్కినా పదింతలు పైకి లేచే తత్వం లాంటివి చాలా అవసరం. 
ఇక  సివిల్స్ ప్రిలిమ్స్  నోటిఫికేషన్ ఫిబ్రవరి 4 న విడుదల కానుంది. మార్చి 5 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 20 వ తేదీ ఆదివారం ప్రిలిమినరీ పరిక్ష జరుగనుంది. 

అప్లికేషన్ వేశామా, ఎక్షామ్ రాశామా అన్నట్లు కాకుండా కొద్దిగా బుర్ర పెట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ గట్టెక్కడం కష్టమేమీ కాదు. తెలుగు మీడియం రాసే అభ్యర్థులు జాగ్రత్త .! తెలుసు కదా .!  ప్రిలిమ్స్ ఇంగ్లిష్ లో రాయాలని . ఒక మంచి డిక్షనరీ, పెన్సిల్  పెట్టుకోండి. అర్థం తెలియని పదాలు కనిపిస్తే అండర్ లైన్ చేసి అక్కడే పెన్సిల్తో తెలుగు అర్థం రాసేసుకోండి. ఇంకోసారి చదివేటపుడు సులువవుతుంది. తెలుగు తో పాటు ఇంగ్లిష్ పేపర్ కూడా చదవడం ప్రారంబించండి.   

చివరగా  ఒక డైలాగు....
------- మీకంటే తోపు లేడెవ్వడిక్కడ. చదవాలనుకుంటే కసిగా చదివేసేయండి.------ 
     

Monday, January 16, 2012

అసలు "జనరల్ స్టడీస్" లో ఏముంటాయి?

అసలు జనరల్ స్టడీస్ అంటే అంటే ఏమిటి? దానికోసం ఎలాంటి అంశాలు చదువు కోవాలి? అనే అంశాలు తికమక పెడుతూ ఉంటాయి. ఈ నేపద్యంలో సివిల్స్ ప్రిలిమినరీ కోసం జనరల్ స్టడీస్ పూర్వ ప్రశ్నాపత్రాల ఆధారంగా ఎ ఎ అంశాలు ప్రిపేర్ అవ్వాలో వేటిలో పట్టు సాధించాలో కొద్ది సమాచారం మీకోసం.


అంశం
మార్కులు
భారత దేశ చరిత్ర 
5-7
ఇండియన్ నేషనల్ మూమెంట్
7-10
ప్రపంచ మరియు భారత దేశ భూగోళ శాస్త్రం
20-38
పాలిటి మరియు గవర్నెన్స్
12-14
ఎకానమి మరియు సాంఘీకాభివృద్ది
16-32
పర్యావరణ శాస్త్రం
10-15
జనరల్ సైన్స్ ఫిజిక్స్
10-12
జనరల్ సైన్స్ బయో సైన్సెస్
12-20
జనరల్ సైన్స్ కెమిస్ట్రీ
8- 11
జెనరల్ నాలెడ్జ్
2-5
కర్రెంట్ అఫ్ఫైర్స్
5-20
Related Posts Plugin for WordPress, Blogger...