Showing posts with label ప్రిపరషన్. Show all posts
Showing posts with label ప్రిపరషన్. Show all posts

Sunday, April 22, 2012

మీలో సివిల్స్ పట్ల ఆసక్తి ఉందా?

                            యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష అనంతరం మెయిన్స్‌లో విజయాన్ని సాధించడం అంత తేలికైన వ్యవహారం కాదు. తక్కువ సంఖ్యలో ఖాళీలు, నాణ్యత ఉన్న అభ్యర్థుల మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా సాగే రాత పరీక్ష పోటీ, అభ్యర్థి అంతరంగాన్ని అన్ని కోణాల నుంచి పసిగట్టే పర్సనాలిటీ టెస్ట్ వీటన్నింటినీ తట్టుకొని విజేతల జాబితాలో చోటును సాధించడం ఆషామాషీ కాదు. విజయవంతమైన ప్రణాళిక, సడలిపోని ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసే వాతావరణం, చక్కగా సూటిగా విషయంలోకి వెళ్ళిపోయే మంచి స్టడీ మెటీరియల్ ఇవన్నీ సివిల్స్ విజయానికి అభ్యర్థి వేసుకోవాల్సిన పునాదిరాళ్ళు, సివిల్ సర్వీస్ పరీక్షలు మూడు దశల్లో ఉంటాయని తెలిసిందే. వాటిలో మొదటిదశ ప్రిలిమినరీ. ఒక అభ్యర్థి తన కెరీర్‌లో సివిల్స్ కోసం యత్నిస్తున్నప్పుడు మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ పాస్ కావడం మంచిది. మొదటిసారి మెయిన్స్ పరీక్షాపత్రాన్ని రాసే అనుభవం చేతికి అందుతుంది. ఎంతమంది బోధించినా, మనం రాస్తే వచ్చిన అనుభూతి రాదు. ప్రథమ పర్యాయంతోనే సివిల్స్ సర్వీస్‌లో విజేతలుగా నిలిచేందుకు అవకాశాలు తక్కువే కావచ్చుగాక, కానీ ప్రిలిమినరీ పాసయ్యేందుకు మాత్రం అభ్యర్థి తప్పకుండా పోరాటం చేయాలి. ముందే చెప్పినట్టు దీనివల్ల మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది. ఇకపోతే, త్వరలో జరుగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్ని మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు కొన్ని ప్రత్యేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవ రాహిత్యంవల్ల మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు పొరపాట్లు చేయకుండా ఈ అంశాలు పనికొస్తాయి. వీటికన్నా ముందు, అసలు, అభ్యర్థి తనకు సివిల్స్‌పై నిజమైన ఆసక్తి వుందా లేదా అన్నది తేల్చుకోవాలి. ఆసక్తిలేకుండా ఊరికే రాస్తూపోవడం శుద్ధ దండుగ.

అభ్యర్థికి సదరు పోటీ పరీక్షపై ఆసక్తి ఉందా? లేదా అన్నది ఈ క్రింది ప్రశ్నల ద్వారా స్పష్టమవుతుంది.
* మీకు సివిల్ సర్వీస్ పరీక్షలు ఏ పద్ధతిలో జరుగుతాయో తెలుసా?
* సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తున్న వారినెవరినైనా కలిశారా?
* సివిల్ పోటీలో ఘనవిజయాన్ని సాధించిన అభ్యర్థుల వివరాలు చదివారా?
* సివిల్స్‌కు అవసరమైన కార్యప్రణాళికను రూపొందించుకున్నారా?
* సివిల్స్‌కు సంబంధించిన మెటీరియల్‌ను సమకూర్చుకుంటున్నారా?
పై ఐదు ప్రశ్నల్లో దేనికీ జవాబు చెప్పలేని అభ్యర్థి రంగంలో ఉన్నా లాభం లేదు. ఎందుకంటే గుంపులో గోవిందా అన్నట్టు తానూ ఓ అప్లికేషన్ పారేశాడు కానీ సివిల్స్ అంటే ప్రాథమిక అవగాహన కూడా లేదన్నమాట. ఆ స్థాయి వ్యక్తులు సివిల్స్ సాధించగలగడం కలలోమాట.
ప్రశ్నల్లో కొన్నింటికైనా సంతృప్తికరంగా సమాధానాలు చెప్పగలిగిన వారు మరింత వేగంగా విజృంభించాలి. అన్ని ప్రశ్నలకు సరిగ్గా జవాబులు చెబుతున్న అభ్యర్థి సివిల్స్ పోటీలో క్రమేపీ రాటు దేలగలడు - సందేహం లేదు. ఇప్పుడు విశే్లషించుకున్నట్టుగా, పై రెండు తరగతుల వారికీ మధ్య ఒక విభజన రేఖ ఉంటుంది. ఈ ప్రశ్నలు అందుకు ఉపయోగపడతాయి.
* మీరు దినపత్రికలు, ఇతర ఉపయోగకరమైన మేగజైన్స్‌ను చదువుతున్నారా?
* టీవీలో కరెంట్ అఫైర్స్ క్రమం తప్పకుండా చూస్తున్నారా?
* బిబిసి వింటున్నారా?
* యోజన, కురుక్షేత్ర వంటి పత్రికలు చదువుతున్నారా?
* ఏదైనా క్లిష్టమైన జాతీయ లేదా అంతర్జాతీయ సంఘటనపై చిన్న వ్యాఖ్యను వెంటనే రాయగలరా?
* ఇరాన్ - అమెరికా సంక్షోభంవంటి ఒక సుదీర్ఘమైన అంశంలో ఇమిడివున్న తేదీలు, వాటి వివరాలు, ప్రముఖుల కొటేషన్సు తిరిగి చెప్పగలరా?
పై ప్రశ్నల్లో అన్నింటికీ సరిగ్గా జవాబులు చెబితే ఇక ఆ అభ్యర్థి చివరి అవకాశంలోనైనా సివిల్స్ విజేతల జాబితాలో చేరిపోతాడు.
వీటికి సరిగ్గా జవాబులు చెప్పలేని వారు పోటీలో కొంత వెనుకబడి వున్నారని తెలుసుకోవాలి.
సమాచార సేకరణ: ప్రిలిమినరీ మొదటిసారి రాసే అభ్యర్థులకు పరీక్ష విధానంపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అదనపు సమాచారం కోసం వీళ్ళంతా పాకులాడుతారు. సీనియర్ల సలహాలు తీసుకుంటారు. అయితే వీటికి కూడా కొంత పరిమితి కావాలి. సమాచార సేకరణ మాత్రమే లక్ష్యంగా మారితే అది అభ్యర్థి విలువైన సమయాన్ని నిలువునా తినేస్తుంది. అలాగని మెళుకువలు తెలియకపోవడం మంచిది కాదు. అయితే సివిల్స్‌పై సకల అంశాన్ని డిగ్రీలో తెలుసుకోవడం మంచిది. అదీ కాకుంటే ప్రిలిమ్స్‌కన్నా కొద్ది నెలల ముందే సేకరణను మానుకోవాలి. ఎందుకంటే సీనియర్లు, నిపుణుల సలహాలు అన్నీ ఒకే దశలో ఉండవు. ఎక్కువ సలహాలతో అభ్యర్థి ఒరిజినల్ ఆలోచనా ధోరణి సైతం మరుగున పడే ప్రమాదం ఉంది. కొద్దిమంది నిపుణుల సూచనల్ని సీరియస్‌గా అభ్యర్థి, మిగతా అటెంప్ట్‌లలో కూడా వాటినే పాటించడం మంచిది.
స్థాయిని అంచనా వేసుకోవడం: తనపై తాను విశ్వాసం లేనివాడు ఎందుకు కొరగాడు. మరీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నా అది సమయానికి విషమ ఫలితాలనిస్తుంది. అందువల్ల వాస్తవికాధారంగా అభ్యర్థి తనను తాను అంచనా వేసుకోవాలి. మిగతా అభ్యర్థులు ఏ స్థాయిలో ఉన్నారో నిర్మాణాత్మకంగా అంచనా వేసుకోవాలి. తన బలహీనతల్ని గుర్తించాలి. కొద్దిమందికి ప్రిలిమినరీలో జనరల్ సైన్స్ విభాగమంటేనే భయం. మరికొందరు లెక్కలంటే ఆదుర్దాపడతారు. జాగ్రఫీ మరికొద్దిమందికి విసుగును తెప్పిస్తుంది. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అయితే అభ్యర్థి తనకు ఫలానా సబ్జెక్టుపై వున్న అయిష్టాన్ని ముద్రగా మలచుకోకూడదు. దాన్ని సాధించే దాకా విడిచిపెట్టకూడదన్న పట్టుదల చాకచక్యం - ఈ రెండింటితో కలగలిపి పయనించాలి. బాగా ఇష్టమయ్యే అంశాలపై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే అది అసలుకే ఎసరుగా మారుతుంది. మరోమాట, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌కన్నా పెద్ద ప్రాముఖ్యత ఆప్షనల్స్‌కు వుంటుంది. దీన్ని అభ్యర్థులు మొదటినుంచి గుర్తుంచుకోవాలి.
సమయానికి తగిన వ్యూహం: విజేతలుగా నిలచిన అభ్యర్థులంతా వివిధ పత్రికలకిచ్చే ఇంటర్‌వ్యూల్లో ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను చదవాలని సలహా ఇస్తుంటారు. దీనిలో వంద శాతం నిజముంది. అయితే విజేతల సలహాల్ని అభ్యర్థులంతా తు.చ. తప్పకుండా అనుసరించాలని ఏమీ లేదు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఎంతో విస్తృతమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇది అందరూ ఒప్పుకునేదే. అయితే పరీక్షకు ప్రిపేరయ్యేందుకు తక్కువ సమయం మాత్రమే ఉన్నప్పుడు ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇలాంటి వేళల్లో అభ్యర్థులు సమయానికి అనుగుణంగా తగు వ్యూహాల్ని తయారుచేసుకోవాలి. కొద్ది రోజుల్లో పరీక్ష ఉన్నప్పుడు నాణ్యమైన జనరల్ స్టడీస్ పుస్తకాలు చదవడంవల్ల మంచి ప్రయోజనాలుంటాయి. దాన్ని కూడా ఎంపిక చేసుకొని చదివితే మరీ మంచిది. ఎంపిక ప్రక్రియకూడా గుడ్డిగా రాయి విసరడం వంటిది కాదు. దీనికో శాస్ర్తియమైన విధానముంటుంది. గత కొద్ది సంవత్సరాల్లో జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల ప్రశ్నాపత్రాల్ని అభ్యర్థి ముందు పెట్టుకోవాలి. ఏఏ విభాగాలనుంచి ఎలాంటి తీరుతెన్నులతో ప్రశ్నల్ని అడుగుతున్నారని మదింపు వేసుకోవాలి. అదే దారిలో తానూ పయనించాలి.
మానసిక స్థిరత్వం: ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ముందుకు సాగేవారు జీవితంలో అద్భుతమైన విజయాల్ని సాధిస్తారు. సమకాలీన సమాజం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. అన్ని పోటీ పరీక్షలు వేరు. సివిల్స్ వేరు. అందువల్ల విజయాన్ని సాధించే అభ్యర్థి కఠినమైన మానసిక స్థిరత్వాన్ని సాధించేందుకు కృషిచేయాలి. ఇది చెబుతున్నంత సులువుకాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. సివిల్స్‌లో విఫలమైనంత మాత్రాన జీవితమంతా చీకటి మాయమైపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు. భయంకరమైన పరాజయానికి అభ్యర్థి తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలి. మానసిక స్థయిర్యం లోపిస్తే అభ్యర్థిలో అనవసరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి. ఇవి విజయపథంలో ముళ్లకంచెల్ని వేస్తాయి. అభ్యర్థికి పరీక్షలకన్నా ఎంతో ముందునుంచే ఎవరైనా తోడుగా ఉంటే మరీ మంచిది. అలాంటి వ్యక్తి నిరంతరం అభ్యర్థి వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉండాలి.
అభ్యర్థి ఎక్కడా నీరస పడిపోకుండా, నీరుకారి పోకుండా జాగ్రత్త వహించాలి. సివిల్స్‌లో నెగ్గిన అభ్యర్థులు తమ విజయానికి పరోక్ష కారణం కుటుంబం నుండి లభించిన ఆదరణేనని చెప్పడం వీరంతా గమనించే ఉంటారు.
సాంకేతిక దోషాలు: మొదటిసారి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు, ప్రశ్నపత్రం చివరన ఉండే సమాచారాన్ని భర్తీ చేయడంలో కొంత ఇబ్బంది పడతారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సాంకేతిక లోపాలేర్పడి ప్రశ్నపత్రం ఇన్‌వాలీడ్‌గా మారుతుంది. అహోరాత్రులు శ్రమించినదంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకని అభ్యర్థి సమాచార పత్రంలోని గళ్లను సూచనల్ని గమనిస్తూ నింపాలి. మరో అంశం. ప్రశ్నపత్రంలో కఠినంగా అనిపించే వాటిని చూసి అట్టే గాభరాపడకూడదు. ముందుగా, నిశ్చయంగా సరియైనవని తోచిన సమాధానాల్ని పూర్తిచేయాలి. వాటి సంఖ్యను మనసులో గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక రానివాటిని, మెల్లమెల్లగా సాధన చేస్తూ పోవాలి. ఇటీవలి కాలంలో ప్రిలిమనరీ ప్రశ్నల్ని చాలా చాకచక్యంగా రూపొందిస్తున్నారు. ప్రశ్నను అజాగ్రత్తగా చదివినా, సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, అంతే సంగతులు. ఇవీ ప్రిలిమినరీ పరీక్షకు సీరియస్‌గా ప్రిపేరవుతున్న సివిల్ అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రిలిమినరీ మొదటిసారికే క్లియర్ చేసుకుంటే మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
3ప్రాథమిక2 ప్రణాళిక ఎలా?: 2012 ప్రిలిమ్స్ పరీక్ష ప్రకటన ఫిబ్రవరి 4న వెలువడింది. నూతన విధానం ప్రవేశపెట్టాక గత ఏడాది జూన్ 12న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ)ని తొలిసారి నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సివిల్స్‌కు సిద్ధమవబోతున్నవారు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలో స్పష్టం చేసుకోవటానికి ఇదే తరుణం! విషయాలను స్థూలంగా ఆకళింపు చేసుకోవటంతోపాటు వాటిలోని సూక్ష్మ వివరాలను కూడా పట్టించుకోవాలి. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కొత్త విధానాన్ని విశే్లషిస్తే బోధపడే సారాంశమిది వచ్చే సంవత్సరం పరీక్షకు రూపొందించుకోవాల్సిన ప్రణాళిక తీరును. ఇప్పుడు చర్చిద్దాం. ఈ ప్రణాళికను 2 అంశాలుగా విభజించాలి.
 1. ఈ ఏడాది ప్రశ్నపత్రం ఫలితాలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక.
 2. సాధారణ కార్యాచరణ ప్రణాళిక.
నిర్దిష్టంగా... పర్యావరణంపై సమాచారం సేకరించాలి. ప్రాథమిక అంశాలను పట్టించుకోవాలి. పర్యావరణం అంటే ఏమిటి అనే ప్రశ్న దగ్గరనుంచి ప్రారంభించి వౌలిక విషయాలను గ్రహించాలి. పునాదిని పటిష్ఠ పరుచుకుని, తర్వాత ఈ విభాగంలో వర్తమాన అంశాలపై దృష్టి పెట్టాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వార్తలకెక్కిన ప్రతి సమాచారాన్ని సేకరించాలి. (ప్రాంతీయ సమాచారం అవసరం లేదు). ఈ అంశాలను ప్రాథమిక సమాచారానికి జోడించాలి. నిశజూజ్ఘ కూళ్ఘూ ఱ్య్యరీ నూ, సామాజిక రంగాలకు సంబంధించిన సాహిత్యాన్ని (్గఉది, బీహార్ నిర్మాణం మొదలైనవి) చదవాలి. ఒక్కో కార్యక్రమ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రారంభమయిందీ మొదలైనవి విస్మరించకూడదు. ఒకసారి ఈ సమాచారం నమోదు చేసుకున్నాక వర్తమాన అంశాలను జోడించటం మొదలుపెట్టాలి. ఈ సందర్భంగా ఓ బంగారు సూత్రం గుర్తుంచుకోవాలి. సామాన్య మానవుణ్ణి ప్రభావితం చేసే ఏదైనా సివిల్ సర్వెంట్లకు ముఖ్యమే!
* పాలిటీ, హిస్టరీ, సైన్స్ మొదలైన విభాగాల్లో అందరూ పాటించే సన్నద్ధతనే సాగించాలి.
* మీ ఇంగ్లిష్ భాషానైపుణ్యాలను అంచనా వేసుకోండి. అవసరమనుకుంటే వాటిని మెరుగుపరచుకోండి. ఇది కేవలం సాధన వల్లనే సాధ్యమవుతుందని గమనించాలి.
* ఇంటర్లో, డిగ్రీలో లెక్కలు సబ్జెక్టుగా గణితేతర విద్యార్థులు మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ విభాగాలపై దృష్టి పెట్టాలి.
* ఈ సంవత్సరం మాదిరే వచ్చే ఏడాది కూడా ప్రశ్నల సంఖ్యా, క్లిష్టత స్థాయి అదే రకంగా ఉండొచ్చని భావించకూడదు. మార్పులకు సిద్ధపడి ఉండటం మేలు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది... ఇక్కడ అవసరమైనది త్యీౄఒ ళకళ పజళతీ. ముఖ్యాంశాల్లో ప్రతి ఒక్క కోణాన్ని దగ్గరగా గమనించి, క్షేత్రస్థాయలో పరిశీలన చేయటం.
ప్రయత్నాలు, వయోపరిమితిలో మార్పులు
------------------------------------------------------
పరీక్ష సంవత్సరం వయోపరిమితి ప్రయత్నాల సంఖ్య
------------------------------------------------------
1949-60 21-24 పరిమితి లేదు
1961-71 21-24 రెండుసార్లు
1972 21-26 రెండుసార్లు
1979-1986 21-28 మూడుసార్లు
1987-1989 21-26 మూడుసార్లు
1990 21-31 నాలుగుసార్లు
1999-ఇప్పటివరకు 21-30 నాలుగుసార్లు


సివిల్స్ పరీక్షలో మార్పులు
--------------------------------------
సంవత్సరం మార్పులు
--------------------------------------
1947 తప్పనిసరి (కంపల్సరీ) సబ్జెక్టుల ప్రవేశం
1948 ప్రపంచ చరిత్ర,
అంతర్జాతీయ న్యాయం సబ్జెక్టుల చేరిక
1961 ఆప్షనల్ సబ్జెక్టుగా హిందీ ప్రవేశం
1966 ఆప్షనల్ సబ్జెక్టుల ప్రక్షాళన
1969 ఆధునిక భారతీయ
భాషల సాహిత్యం చేరిక
1979 ప్రిలిమ్స్ తొలిసారిగా ప్రవేశపెట్టారు
1987 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశం
1993 సబ్జెక్టుగా మెడికల్ సైన్స్ చేరిక

Wednesday, February 22, 2012

సివిల్స్ సాధించండిలా!

 
దేశంలోనే అత్యుత్తమ సర్వీస్ సివిల్ సర్వీసు. సమాజంలో మమేకమై ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ అపారమైన సేవలందించాలనుకునే అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ వారధిలా నిలుస్తుంది. 
కార్యదీక్ష, కఠోర శ్రమ, సామాజిక, ఆర్థికాంశాలపై విస్తృతమైన అవగాహన, భారత రాజ్యాంగం తీరు తెన్నులు, తార్కిక విశే్లషణ, ఆలోచనా సామర్ధ్యం, నిర్ణాయక శక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్ష వరంలా నిలుస్తుంది. 
దేశంలోని వివిధ సర్వీసుల కింద ఉన్న అత్యుత్తమ ఉద్యోగాలకుగాను ఈ పరీక్షను నిర్వహిస్తారు. గత ఏడాది ఈ సర్వీసు కింద 880 మందిని ఎంపిక చేయగా ఆ సంఖ్య ప్రస్తుతం 1037కు పెరిగింది. సివిల్ సర్వీసెస్ కిందకు వచ్చే విభాగాలు :
* ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు 
* ఇండియన్ ఫారెన్ సర్వీసు 
* ఇండియన్ పోలీస్ సర్వీసు 
* ఇండియన్ పి అండ్ టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసు (గ్రూప్-ఏ) 
* ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐటి) (గ్రూప్-ఎ) 
* ఇండియన్ పోస్టల్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (గ్రూప్-ఎ, గ్రేడ్-3) 
* ఇండియన్ కార్పొరేట్ ‘లా’ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీసు (గ్రూప్-బి) 
* ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డయుడామన్, దాద్ర అండ్ నగర హవేలీ పోలీస్ సర్వీసు (గ్రూప్-బి) 
* పాండిచ్చేరి సివిల్ సర్వీసు (గ్రూప్-బి) 
* పాండిచ్చేరి పోలీస్ సర్వీసు (గ్రూప్-బి) 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంనుంచి బ్యాచిలర్స్ డిగ్రీ. డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మెయిన్ పరీక్ష దరఖాస్తు సమయం నాటికి అభ్యర్థులు సంబంధిత సర్ట్ఫికెట్ పొంది ఉండాలి. 
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా. వయోపరిమితి: ఈ పరీక్షకు హాజరు కాగోరు అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2012 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. 
దరఖాస్తు చేసే విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు: 50 రూపాయలు. చివరి తేదీ: మార్చి 5, 2012 పరీక్ష తేదీ: మే 20. 
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ 
పరీక్ష విధానం: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. రెండు పేపర్లలోను ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయి. 
పేపర్ 1: జనరల్ స్టడీస్, 200 మార్కులు 
పేపర్2: జనరల్ ఆప్టిట్యూడ్ 200 మార్కులు 
పేపర్-1 (సబ్జెక్టువారీ వెయిటేజి): 
కరెంట్ అఫైర్స్:4 ప్రశ్నలు 
హిస్టరీ:13 ప్రశ్నలు 
జాగ్రఫీ: 8 ప్రశ్నలు 
పాలిటీ: 14 ప్రశ్నలు 
ఎకానమీ: 22 ప్రశ్నలు 
ఎకాలజీ: 18 ప్రశ్నలు 
జనరల్ సైన్స్: 21 ప్రశ్నలు 
పేపర్-2 (సబ్జెక్టువారీ వెయిటేజి) 
కాంప్రహెన్షన్: 27 ప్రశ్నలు 
డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్: 8 ప్రశ్నలు 
జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ: 28 ప్రశ్నలు 
అనలిటికల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్: 8 ప్రశ్నలు 
ఇంగ్లీష్ లాంగ్వేజి కాంప్రహెన్షన్: 9 ప్రశ్నలు 
సిలబస్ 
కరెంట్ అఫైర్స్: చరిత్ర, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, ఎకాలజీ తదితర అంశాలపై పేపర్-1 ఉంటుంది. 
జనరల్ ఆప్టిట్యూడ్: ఇక పేపర్-2లో కాంప్రహెన్షన్, ఇంటర్ ప్రిటేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, ఇంగ్లీషు లాంగ్వేజి కాంప్రహెన్షన్ స్కిల్స్ తదితర అంశాలను పొందుపరచడం జరిగింది. 
ప్రిపరేషన్ ఇలా: కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి చోటుచేసుకున్న సంఘటనలు తాజా సమాచారంతోపాటు సంబంధిత నేపథ్యంపై పట్టు సాధించాలి. అలాగే జాతీయ ప్రభావం కలిగిన ప్రాంతీయ సంఘటనలపై కూడా దృష్టి సారించాలి. అలాగే సదస్సులు, సమావేశాల్లో విడుదల చేసిన డిక్లరేషన్లు వంటి టైటిళ్లు, ఇతర అన్ని రంగాలలో జరిగిన, జరుగుతున్న మార్పులు, సంఘటనలను ప్రతి అంశాన్నీ విడిచిపెట్టకుండా సాధన చేయాలి. 
రిఫరెన్స్ బుక్స్:
కాంపిటీషన్ విజర్డ్, కరెంట్ అఫైర్స్ పుస్తకాలు, యోజన, ఎకనమిక్ సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే. 
చదవాల్సిన పుస్తకాలు:
* ఎన్‌సిఈఆర్‌టి పుస్తకాలు 
* తెలుగు అకాడమీ చరిత్ర పుస్తకాలు 
* మోడ్రన్ ఇండియా-బిపిన్ చంద్ర 
* మిడీవల్ ఇండియా- సతీష్ చంద్ర 
* ఏనె్షంట్ ఇండియా-ఆర్.ఎస్.శర్మ 
* ఇండియన్ ఇయర్ బుక్ 
* ఇండియన్ పాలిటీ-లక్ష్మీకాంత్ 
* ఇండియన్ ఎకానమీ-మిశ్రా 
* ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్-ఎంఎల్‌జింగస్ 
* ఇండియన్ ఎకానమీ-దత్ 
* ఇండియన్ ఎకానమీ- కపిల ఉమ 
* ఎ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్ 
* అనలిటికల్ రీజనింగ్ 
* సైన్స్ రిపోర్టర్, వివిధ జాతీయ దినపత్రికల్లో వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు, విశేషాలు.
 ప్రిపరేషన్ ఇలా:
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి చాలా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఏది ముఖ్యమైనదో, ఏది ముఖ్యమైనది కాదో అర్ధం కాక అభ్యర్థులు ఇబ్బంది పడుతూంటారు. అందువల్ల గతంలో ఇచ్చిన సివిల్స్ ప్రశ్నా పత్రాలను సేకరించుకుని అందులో వచ్చిన మాదిరి ప్రశ్నలను అధ్యయనం చేయడం అవసరం. అలాగే జాతీయ ప్రభావం కలిగిన ప్రాంతీయ సంఘటనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఆయా సంఘటనల మూలాన్ని కూడా గమనించాలి. అలాగే కరెంట్ ఎఫైర్స్ కోసం అభ్యర్థులు ఎక్కడి వరకు సంఘటనలను కరెంట్ అఫైర్స్ కోసం చదవాలో తెలియక ఇబ్బంది పడతారు. అయితే పరీక్ష తేదీనుంచి ఒక ఏడాది ముందు కాలం వరకు సంఘటనలను తెలుసుకుంటే సరిపోతుంది. ఇక స్టాండర్డ్ జీకే విషయంలో తేదీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్దేశిత వరుస క్రమానికి ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కరెంట్ అఫైర్స్ అన్ని రంగాలలో చోటు చేసుకునుంటాయి. అందువల్ల ఆయా రంగాలలోని మూలాలనుంచి అంశాలను అధ్యయనం చేయడంవల్ల ఆ విషయ పరిజ్ఞానం, భవిష్యత్తులో జరగబోయే మెయిన్ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.
సలహాలు  సూచనలు:
*జీవ శాస్త్రంలో ప్రాధమిక విషయాలపై పట్టు సాధించిన అభ్యర్థులకే ఎకాలజీలో అంశాలు బాగా అర్ధమవుతాయి. ఈ విషయాన్ని గుర్తించి ఎకాలజీలోని అన్ని అంశాలను 8-12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టి పుస్తకాల ద్వారా అభ్యాసంచేయాలి. 
*ఇక ఎకానమీకి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టి పదకొండవ తరగతికి చెందిన 3ఇండియన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌తోపాటు తెలుగు అకాడమీకి చెందిన 3్భరత ఆర్థిక వ్యవస్థకు చెందిన పుస్తకాలు చదువుకోవాలి. వీటితోపాటు సిలబస్‌లో ఉన్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలాగే 3యోజన2, 3కురుక్షేత్ర2 వంటి మ్యాగజైన్లు చదువుకోవడం ఉపయుక్తం కాగలదు. 
*జనరల్ సైన్స్‌కు సంబంధించి అభ్యర్థులు ముఖ్యంగా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వంటి ప్రాధమిక సబ్జెక్టులతోపాటు టెక్నాలజీకి సంబంధించి అన్ని అంశాలను క్షుణ్ణంగా చదవాలి. సైన్స్ సబ్జెక్టులు చదవని అభ్యర్థులు సైన్సు సబ్జెక్టుని నిర్లక్ష్యం చేస్తారు. సైన్సు పదాలను గుర్తుంచుకోవడానికి ఇబ్బంది పడతారు. అయితే బేసిక్స్‌పై పట్టు సాధించినపుడే పదాలను గుర్తుంచుకోవడం సులభమవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఏ విభాగాన్నీ వదిలిపెట్టక పోవడం చాలా శ్రేయస్కరం కాగలదు. 
*పాలిటీ విషయంలో రాజ్య వ్యవస్థతోపాటు దానిని ప్రభావితం చేసే పాలనా యంత్రాంగంపై కనీస అవగాహన ఉండాలి. అలాగే ఈ విభాగంలో అడిగే ప్రశ్నలన్నీ సమకాలీన జాతీయ, అంతర్జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇస్తారని గ్రహించి, ఆ మేరకు చదువుకోవడం ఉత్తమం. 
* హిస్టరీకి సంబంధించి ఆధునిక చరిత్రపై ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యంగా జాతీయోద్యమం, దానికి సంబంధించిన అన్ని మూలాలను గురించి క్షుణ్ణంగా చదువుకోవాలి. అలాగే ఏనె్షంట్, మిడీవియల్ హిస్టరీకి చెందిన కళలు, సాహిత్యం, ఉద్యమాలు, రాజకీయ సామాజిక అంశాలకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. 
*జాగ్రఫీలో ప్రాధమిక అంశాలతోపాటు ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, విధానాలు, సమస్యలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో నెగ్గుకు రావడం తేలికేనని గుర్తించాలి. 
*అభ్యర్థుల్లో నిర్ణాయక శక్తిని, సమస్యను గుర్తించే లక్షణాన్ని డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో గమనిస్తారు. అలాగే తార్కికంగా విశే్లషించే సామర్ధ్యాన్ని లాజికల్ రీజనింగ్ విభాగంలో గమనిస్తారు. ఈ రెండు విభాగాలలో రాణించాలంటే గ్రాహణ శక్తి, సమయ స్పూర్తితోపాటు పర్సనల్ స్కిల్స్‌ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 
*అభ్యర్థులలోని మేథో సామర్ధ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఈ విభాగానికి సంబంధించి ఈక్వేషన్స్, రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, జామెట్రీ అండ్ మెన్సురేషన్, కౌంటింగ్ టెక్నిక్స్, ప్రాబబిలిటీ, నంబర్స్ లెటర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండర్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. 
*నిర్దేశిత విషయంపై అభ్యర్థికున్న అవగాహన ఏపాటిదో కాంప్రహెన్షన్ విభాగంలో నిర్ణయిస్తారు. ఈ విభాగంలో రాణించాలంటే క్రిటికల్ థింకింగ్ నాలెడ్జ్, ఇచ్చిన విషయంలో సారాంశాన్ని వెంటనే గుర్తించగలిగే నైపుణ్యం అవసరం. ఇంగ్లీషుపై ప్రాధమిక పరిజ్ఞానంతోపాటు వేగంగా చదివి అర్ధం చేసుకునే లక్షణాలుండాలి. 
*ఆయా అంశాలకు సంబంధించిన ప్రశ్నలు, జవాబులు రాబట్టేందుకు వేగం ఖచ్చితత్వం చాలా అవసరం. సబ్జెక్టుపై పట్టు, వీలైనన్ని మాక్ టెస్టులు చేయడంవల్ల ఆత్మవిశ్వాసం పెరిగి సమాధానాలు రాబట్టే ప్రక్రియలో వేగం పెరుగుతుంది. కనక నిరంతర అభ్యాసంతోనే వేగం, ఖచ్చితత్వం ఏర్పడతాయన్న విషయాన్ని గుర్తించి పరీక్షకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.

Monday, January 16, 2012

అసలు "జనరల్ స్టడీస్" లో ఏముంటాయి?

అసలు జనరల్ స్టడీస్ అంటే అంటే ఏమిటి? దానికోసం ఎలాంటి అంశాలు చదువు కోవాలి? అనే అంశాలు తికమక పెడుతూ ఉంటాయి. ఈ నేపద్యంలో సివిల్స్ ప్రిలిమినరీ కోసం జనరల్ స్టడీస్ పూర్వ ప్రశ్నాపత్రాల ఆధారంగా ఎ ఎ అంశాలు ప్రిపేర్ అవ్వాలో వేటిలో పట్టు సాధించాలో కొద్ది సమాచారం మీకోసం.


అంశం
మార్కులు
భారత దేశ చరిత్ర 
5-7
ఇండియన్ నేషనల్ మూమెంట్
7-10
ప్రపంచ మరియు భారత దేశ భూగోళ శాస్త్రం
20-38
పాలిటి మరియు గవర్నెన్స్
12-14
ఎకానమి మరియు సాంఘీకాభివృద్ది
16-32
పర్యావరణ శాస్త్రం
10-15
జనరల్ సైన్స్ ఫిజిక్స్
10-12
జనరల్ సైన్స్ బయో సైన్సెస్
12-20
జనరల్ సైన్స్ కెమిస్ట్రీ
8- 11
జెనరల్ నాలెడ్జ్
2-5
కర్రెంట్ అఫ్ఫైర్స్
5-20

Friday, December 30, 2011

జనరల్ స్టడీస్ : పుస్తకాలు

జనరల్‌ స్టడీస్‌..ఈ పేరు, పేపర్‌ పలు విద్యాఉద్యోగ పరీక్షల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. సివిల్స్‌, గ్రూప్స్‌, జూనియర్‌ లెక్చరర్స్‌, ఎస్సై, కానిస్టేబుల్స్‌...ఇలా అనేక పరీక్షల్లో అభ్యర్థులు రాయాల్సిన కామన్‌ పేపర్‌ జనరల్‌ స్టడీస్‌. ఇందులో ఏ..ఏ..అంశాలు వస్తాయి. దీని పరిధి ఏంటి ! సివిల్స్‌కు, కానిస్టేబుల్స్‌కు ఒకే విధంగా ప్రిపేరవ్వాలా ! వంటి సందేహాలను తీర్చడానికి
ఇక్కడ అనేక విషయాలు ఇస్తున్నాం...
ఏ పోటీ పరీక్ష పరీక్షకైనా విద్యార్థి సిద్ధమవ్వాలంటే...మూడంచెలను పాటించాలి. 
1.సిలబస్‌ను చదివి, సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 
2.పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, అడిగిన తీరును అవగాహన చేసుకోవాలి. 3.సిలబస్‌లోని అన్ని జనరల్‌ ఏరియాస్‌ చదవటంతోపాటు పరీక్షలో రావటానికి అవకాశమున్న ధోరణులపై (పూర్వ ప్రశ్నల ఆధారంతో) దృష్టి పెట్టాలి.
------------------------------- @@@@@ ---------------------------

సివిల్స్‌కైనా, కానిస్టేబుల్‌ పరీక్షకైనా ఇదే విధానం వర్తిస్తుంది. కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. ముందుగా జనరల్‌ స్టడీస్‌లో ఏ విషయాలు వస్తాయి. వాటని ఎలా అధ్యయనం చేయాలన్నది తెలుసుందాం.
ఇందులో వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ-పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు...వీటన్నింటినీ చదివి, అర్థం చేసుకొని, ప్రతీదాంట్లో ప్రావీణ్యం సాధించటం ఎవరికైనా అసాధ్యం. మరేం చేయాలి ! తార్కికంగా చూసినా ఉన్న మార్గం - ట్రెండ్స్‌కు గుర్తించి, అనుసరించటమే. అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఇతర పోటీ పరీక్షల మాదిరి సివిల్స్‌, గ్రూప్స్‌లో జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నలను ఊహించటం కష్టమే. అంటే గతానుభవాల ఆధారంగా భవిష్యత్తులో ప్రశ్నలను ఊహించలేం.
ముఖ్యంగా మన జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కొన్ని ప్రశ్నల్ని సెట్‌ చేస్తారు. రీజనింగ్‌ విభాగమూ ఉంటుంది. అంటే వీటిని ముందుగా అర్థం చేసుకోవటం కష్టం. పేపర్‌ సెట్‌ చేసిన వారి ఉద్దేశం...సమాధానాన్ని కనిపెట్టడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవాలనే ఎత్తుగడ. ముఖ్యంగా ఈ తరహా సివిల్స్‌, గ్రూప్స్‌లో కనిపిస్తుంది. ఇక కానిస్టేబుల్స్‌, విఆర్‌ఓ, విఆర్‌ఎ, గ్రూప్‌-డి స్థాయి ఉద్యోగాల్లో జనరల్‌ స్టడీస్‌ పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది.
భారత జాతీయోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, సాంఘికార్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక ఆర్థిక అవగాహన, భూగోళవ్యవస్థ....మొదలైనవి అందరూ చదవాల్సిన అంశాలు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులు ఈ విషయాల్లో చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఇక ట్రెండ్స్‌ విషయానికొస్తే...వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, వీటికి తగిన నిర్వచనం ఇవ్వలేం. సిలబస్‌ అంటూ పేర్కొనలేం. గత సంవత్సరకాలంగా జరిగిన వర్తమాన వ్యవహారాలు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటించిన పథకాలు, పేరొందిన పథకాలు, వివిధ నివేదికలు, వాటి ప్రస్తావనలు, కమిషన్లు, దేశంలోని జరిగిన ముఖ్య సంఘటనలు...ఇలాంటివెన్నో. దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన విషయాల్ని నోట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఈ విభాగంలో మనం ఎంత సాధిస్తే అంత మంచిది. మంచి స్కోరింగ్‌కు అవకాశముంది. మోడల్‌ పేపర్లు సాధన చేస్తే అవగాహన వస్తుంది. గ్రిప్‌ దొరుకుతుంది.

------------------------------ @@@@@@@@ --------------------------

సివిల్స్‌, గ్రూప్స్‌కు సిద్ధమయ్యేవాళ్లు, తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి.
అవి...
  • ఎన్‌సిఈఆర్‌టి ప్రాథమిక పుస్తకాలు, 
  • తెలుగు అకాడమీ ప్రచురణలు, 
  • హ్యుమానిటీస్‌ (ఇండియన్‌ పాలిటీ, సోషియాలజీ)లలో అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ. పుస్తకాలు, 
  • తెలుగు, ఆంగ్ల వార్తపత్రికలు, 
  • పబ్లికేషన్స్‌ డివిజన్‌ 'ఇండియా ఇయర్‌బుక్‌', 
  • తెలుగు, ఇంగ్లీష్‌లలో ప్రచురితమయ్యే 'యోజన'.
తెలుగు మీడియం నేపథ్యమున్నవారు మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్‌ అంశాలతో తేలిగ్గా పరిచయం పెంచుకోవచ్చు. ముఖ్యంగా సివిల్స్‌ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2లో కొన్ని విషయాలపై ప్రశ్నలుంటున్నాయి. అవి... 
  • కాంప్రహెన్షన్‌, 
  • ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌, 
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, 
  • లాజికల్‌ రీజనింగ్‌, 
  • అనలిటికల్‌ ఎబిలిటి, 
  • డెసిషన్‌ మేకింగ్‌, 
  • ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, 
  • జనరల్‌ మెంటల్‌ ఎబిలిటి, 
  • బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), 
  • ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ ( పదో తరగతి స్థాయి).
గత ఏడాది కాంప్రహెన్షన్‌ విభాగం నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇది కొనసాగుతుంది. క్లిష్టత స్థాయి కూడా యధావిధిగా ఉంటుంది. గణితంలో ప్రశ్నల సంఖ్య అలాగే ఉండొచ్చు. కానీ క్లిష్టత స్థాయి పెరగవచ్చు. డెసిషన్‌ మేకింగ్‌లో ప్రశ్నలు కూడా పెరిగే అవకాశముంది. పూర్తిగా పరిణామశీల అంశాలతో కూడి వుంటుంది. అంటే ఇప్పటి పరిస్థితులతో అప్లై చేసి అడుగుతారు. ఈ పేపర్లో మంచి స్కోరింగ్‌ చేయాలంటే...కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇందులో అడిగే అంశాలన్నింటిలో పట్టు సాధించటం సాధ్యం కాదు. అందుకని గరిష్ట మార్కులు సాధ్యమయ్యే అంశాలను ఎంచుకోవటం మేలు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయకంగా స్కోరింగ్‌గా ఉన్న అంశాలను పరిష్టపరుచుకోవడం మంచింది. ఈ సూత్రం అన్ని రకాల పరీక్షలు రాసే అభ్యర్థులకు వర్తిస్తుంది. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. మన సమయాన్ని, శక్తిని వృధా చేసే వాటి నుంచి తప్పుకోవటం తెలివైన పని. లక్ష్యసాధనకు సులువైన పని.
క్వాంటిటేటివ్‌ విభాగంలో సంఖ్యలను అర్థం చేసుకోవటం జాతీయ స్థాయి పరీక్షల్లో కొంచెం కష్టమే. వీటి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అభ్యర్థులు సాధనతో ఈ కష్టమైన అంశాన్ని సలభతరం చేసుకోవచ్చు. ఈ విభాగాన్ని సెట్‌ చేయడం వెనుకున్న ఉద్దేశం...అభ్యర్థి సమయాన్ని హరించటమే. సరైన సాధన ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. వీలైనంత ఎక్కువ స్కోరింగ్‌ చేస్తే విజయానికి దగ్గరవుతాం. ఇంగ్లీష్‌పై పట్టులేనివారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పదో తరగతి లోపే ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు. అలాగే సిలబస్‌లో లేని అంశాలపై లోతైన అధ్యయనం చేయటం వృధా. మన ప్రిపరేషన్‌ క్లిష్టంగా మారుతుంది.
అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలు : 
  • ఆర్థమెటిక్‌లో ప్రాథమిక పుస్తకాలు. 
  • మౌలిక విషయాలు తెలిపే ఇంగ్లీష్‌ బుక్స్‌, 
  • ఇగ్నో ప్రచురించిన ఫంక్షనల్‌ ఇంగ్లీష్‌ పుస్తకాలు, 
  • బ్యాంకింగ్‌ పరీక్షల పాత మోడల్‌ పేపర్లు, 
  • ఇంగ్లీష-తెలుగు నిఘంటువు.
ఏ ఉద్యోగ పరీక్ష అయినా అడిగే విధానం ఒకేవిధంగా ఉంటుంది. కానీ ప్రశ్నల స్థాయి వేరు వేరుగా ఉంటుంది. సమయ నిర్వహణపై సాధన లేకుండా ప్రశ్నలను ఎదుర్కొనలేం. కాబట్టి మోడల్‌ పేపర్లు సాధన చేయాలి. తద్వారా సబ్జెక్‌పై, ప్రశ్నలపై అవగాహన ఏర్పడుతుంది. మనం ఇంకా ఎలా సిద్ధమవ్వాలి అన్నది తెలుస్తుంది.
 
ALL THE BEST

Saturday, December 24, 2011

మీడియం తో నిమిత్తం లేకుండా సివిల్స్ 2012 సాధించండిలా .!


సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఈ పేరు వింటేనే కొంతమంది ఓ బ్రహ్మ పదార్థంగా.. మేధావులకే పరిమితమైందిగా భావిస్తారు. మెట్రోపాలిటన్ నగరాలు, ఇంగ్లిష్ మీడియం నేపథ్యంతోనే విజయం సాధ్యం అనే అభిప్రాయం (అపోహ) తో ఉంటారు. అయితే ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. సివిల్స్ విజయానికి కావల్సింది అకడెమిక్, ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. సాధించాలనే ‘విల్’ పవర్. సివిల్స్-2012 నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ పరీక్ష విధి విధానాలు, అభ్యర్థుల అనుమానాలపై విశ్లేషణలతో పరీక్షకు సన్నద్ధం చేసేలా నిపుణుల సలహాలు..

దేశంలోనే అత్యున్నత సర్వీసులుగా పేర్కొనే ఐఏఎస్, ఐపీఎస్, తదితర ఇరవైకి పైగా కేంద్ర సర్వీసుల్లో అధికారులను ఎంపిక చేసే ప్రక్రియే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్ట ఎంపిక విధానంగా పేరుపొందిన పరీక్ష ఇది.

సహనం ఎంతో అవసరం:
సివిల్స్ ఔత్సాహికులకు ప్రథమంగా ఉండాల్సిన ప్రధాన లక్షణం సహనం. కారణం.. దీని ఎంపిక ప్రక్రియే ఏడాదిపాటు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఉండే ఈ ఎంపికలో ప్రిలిమ్స్ మే నెలలో జరుగుతుంది. చివరి దశ ఇంటర్వ్యూ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యేది ఆ తదుపరి సంవత్సరం మే లోనే. ఇంత సుదీర్ఘ ప్రక్రియతో కూడి ఉండే పరీక్ష సివిల్స్.

కోచింగ్ వర్సెస్ సెల్ఫ్ స్టడీ:
సివిల్స్ వంటి అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అభ్యర్థులకు మొదటగా తలెత్తే సందేహం కోచింగ్ గురించే. కోచిం గ్ తీసుకుంటేనే విజయం సాధ్యమనే అభిప్రాయం బలం గా ఏర్పడింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు కోచింగ్ తీసుకోకుండానే, కేవలం ఇంటర్వ్యూ గెడైన్స్ తీసుకుని విజయం సాధించినవారున్నారు. సివిల్స్ 2009లో విజేతగా నిలిచిన దేవిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి సొంత ప్రిపరేషన్‌తోనే విజయం సాధించారు. ఇలా మరెందరో ఉన్నారు. కాబట్టి.. కోచింగ్ అవసరం అని కచ్చితంగా చెప్పలేం.

అయితే కోచింగ్ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా లాభిస్తుందని చెప్పొచ్చు. అభ్యర్థులు బలంగా ఉన్న సబ్జెక్టులకు సొంతంగా సిద్ధమై, బలహీనంగా ఉన్న సబ్జెక్టులకు కోచింగ్ తీసుకోవచ్చు. ఎక్కువమంది అభ్యర్థులు చేసేది ఇదే. అయితే కోచింగ్ వల్ల మంచి సహచరులు పరిచయమవుతారు. దానివల్ల బృంద చర్చలకు ఆస్కారం ఉంటుంది.

తెలుగు మీడియంతో సాధ్యమేనా:
సివిల్స్ అందుకునేందుకు కావాల్సిన పరిశ్రమ, సహనం ఉన్నవారికి ఏ మీడియమైనా ఒకటే. తెలుగు మీడియంలో సివిల్స్ రాసి విజేతలుగా ఎంపికైనవారెందరో. అంటే.. సివిల్స్‌లో విజయానికి కావాల్సిందల్లా కష్టపడి చదవడమే. ఈ క్రమంలో మొదటిసారే విజయం సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది మూడుసార్లు పరాజితులై చివరిదైన నాలుగో అటెంప్ట్‌లో విజయం సాధించారు. ఇలాం టి వారిని ప్రేరణగా తీసుకోవాలి. రెండు, మూడుసార్లు పరాజయాలు పలకరించినా బెదరక రెట్టించిన ఉత్సాహంతో ఎగసే కెరటంలా చెలరేగాలి.

కాకపోతే ఇంగ్లిష్‌లో మెటీరియల్ లభ్యత ఎక్కువ. ఒకప్పుడు తెలుగులో మెటీరియల్ కొన్ని సబ్జెక్టుల్లోనే లభించేది. ఇప్పుడు దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ మెటీరియల్ విరివిగా దొరుకుతుంది. ఇంగ్లిష్‌లో కొంచెం బలహీనంగా ఉన్న అభ్యర్థులు, ఇంగ్లిష్‌లో మాత్రమే లభించే మెటీరియల్ విషయంలోనూ ఆందోళన చెందక్కర్లేదు. అలాంటి మెటీరియల్‌లోని సమాచారాన్ని తెలుగులోకి అనువదించుకుని చదువుకోవడం వల్ల ఆ సమస్య నుంచి గట్టెక్కొచ్చు.

మంచి అకడెమిక్ నేపథ్యం లేకపోయినా:
చాలామంది అకడెమిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినవారు మాత్రమే సివిల్స్ సాధించగలరని అపోహ పడుతుంటారు. ఇది సరికాదు. గతంలో సివిల్స్‌లో విజేతలుగా నిలిచిన వారిలో చాలామంది అకడెమిక్ పరీక్షలో సాధారణ మార్కులు సాధించినవారే. కాబట్టి ఎక్కడ, ఏం చదివారు అనే దానికంటే సివిల్స్ దృక్కోణంలో ఒక అంశాన్ని ఎలా చదివారు, ఏం గ్రహించారు, చక్కని భావవ్యక్తీకరణ, తప్పులను సరిదిద్దుకోగల నేర్పు ఉన్నవారు తేలికగా విజయం సాధించొచ్చు.

అకడెమిక్స్‌కు అదనంగా:
సివిల్స్ ఔత్సాహికులకు అకడెమిక్స్‌కు అదనంగా కొన్ని సహజ లక్షణాలు అలవర్చుకోవాలి. అవి.. చేసే పనిపట్ల ప్రేమ, పట్టుదల, ప్రణాళిక, పరిశ్రమ, అణకువ, అంకిత భావం, ఆత్మ స్థైర్యం, ఆత్మ విమర్శ, ఏ విషయం చదివినా గ్రహించడంలో స్పష్టత, వ్యక్తీకరించడంలో సరళత, వివరించడంలో సంగ్రహత. ప్రతిరోజూ రేడియో వార్తలు వినడం, వివిధ దినపత్రికలను చదవడం, చదివినదానిపై ఆలోచించి సహచరులతో చర్చించడం, సామాజిక సమస్యల పట్ల సానుభూతితో స్పందించడం. నిజాయితీతో, నిర్భయంగా, నమ్రతతో చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగడం. వీటిని పెంపొందించుకుంటే భావి విజేతలుగా అవతరించొచ్చు.

అర్హతలివే:
గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఆగస్టు 1, 2012 నాటికి 21-30 ఏళ్లు. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు.
ఎన్నిసార్లు రాయొచ్చు: ఓసీలు వయోపరిమితికి లోబడి గరిష్టంగా నాలుగుసార్లు, ఓబీసీలు ఏడుసార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా రాయొచ్చు. అయితే ఈ మూడంచెల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో) ఎందులో విఫలమైనా మొదటి నుంచి ప్రస్థానం మొదలుపెట్టాలి. ఉదాహరణకు ఒక అభ్యర్థి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలో విఫలమైతే..మళ్లీ ప్రిలిమ్స్ నుంచి రాయాలి. అంతేకాకుండా ప్రిలిమ్స్‌లో ఒక్క పేపర్‌కు హాజరైనా ఒక ప్రయత్నం పోయినట్లే. అత్యుత్తమంగా ప్రిపరేషన్ ఉందనుకుంటేనే రాయడం మంచిది.

ఎవరికైనా సాధ్యమే
గత దశాబ్ద కాలంగా సివిల్స్ ఫలితాలు, విజేతల అనుభవాలు పరిశీలిస్తే సివిల్స్ పరీక్ష అత్యున్నతమైనప్పటికీ.. అందని ద్రాక్ష మాత్రం కాదు అని స్పష్టమవుతోంది. శాస్త్రీయంగా, ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే ఏ నేపథ్యం ఉన్న అభ్యర్థులైనా ఇందులో విజయం సాధించడం సులభమే. కనీసం ఒక సంవత్సరం పూర్తిస్థాయి ప్రిపరేషన్ మాత్రం తప్పనిసరి.

ఇక.. మొదటిసారే విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఎందరో. సివిల్స్ పరీక్షను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు ప్రతి రోజు రేడియో, దినపత్రికలు, టీవీల్లోని వార్తలు, చర్చలు, వ్యాఖ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తుండాలి. వాటిపై విశ్లేషణలు చేయాలి. సమాజంలో జరిగే సంఘటనలను నిశితంగా గమనించాలి. మనోరమ ఇయర్ బుక్, ఇండియా ఇయర్ బుక్, ఎన్‌సీఈఆర్‌టీ 9 నుంచి 12 తరగతుల పుస్తకాల అధ్యయనంతో ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టాలి.

మెయిన్‌‌సలో ఆప్షనల్స్ ఎంపిక ఇలా:
సివిల్స్ పరీక్ష క్రమంలో అత్యంత కీలక అంశం ఆప్షనల్స్ ఎంపిక. 2010 వరకు ప్రిలిమ్స్‌లో కూడా ఒక పేపర్ ఆప్షనల్‌గా ఉండేది కాబట్టి.. చాలా మంది అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికీ కలిసొచ్చేలా ఎంచుకునే వీలుండేది. కానీ 2011 నుంచి ప్రిలిమ్స్‌లో ఆప్షనల్ విధానానికి స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో ఆప్షనల్స్ ఎంపిక విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.అభ్యర్థులు తాము చదివిన గ్రాడ్యుయేషన్ సబ్జెక్టులాధారంగా మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల అకడెమిక్ స్థాయిలో పట్టున్న సబ్జెక్టులను ప్రిపేర్ కావడంలో ఇబ్బంది ఎదురు కాదు.

అయితే మూడేళ్ల డిగ్రీలో చదవని సబ్జెక్టులను సైతం ఆప్షనల్స్‌గా ఎంచుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మెయిన్స్ వ్యాసరూప సమాధానాలు రాయాల్సిన పరీక్ష. కాబట్టి బాగా పట్టున్న, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా రాయగల సబ్జెక్టులను ఎంచుకోవడం మంచిది. అంతేకాకుండా ఆ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ లభ్యత, కోచింగ్ సదుపాయాలు మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అవసరమైతే అంతకు ముందు సివిల్స్ విజేతలను సంప్రదించి వారి గెడైన్స్‌ను కూడా తీసుకోవడం ఉత్తమం.

ఎంపిక విధానం

ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు అంచెల్లో వివిధ సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమ్స్:
ఈ ఏడాది (2011) నుంచి ప్రిలిమినరీ పరీక్ష తీరుతెన్నులు మారాయి. ఇంతకు ముందు వరకు జనరల్ స్టడీస్‌కు 150 మార్కులు, అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకు 300 మార్కులు ఉండేవి. 2011 నుంచి పేపర్-2 ఆప్షనల్ స్థానంలో ఆప్టిట్యూట్ టెస్ట్ ప్రారంభిం చారు. దీంతో పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు జరుగుతున్నాయి.

మెయిన్స్:
మొత్తం ఖాళీలను పరిగణించి.. 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌‌సకు ఎంపిక చేస్తారు. మెయిన్‌‌సలో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. పేపర్-1 (రీజనల్ లాంగ్వేజ్), పేపర్-2 (ఇంగ్లిష్) కేవలం అర్హత పేపర్లే. వీటిలో సాధించిన మార్కులను ఇంటర్‌వ్యూకి ఎంపిక చేసేందుకు పరిగణించరు. పేపర్-3 జనరల్ ఎస్సే, పేపర్-4,5 జనరల్ స్టడీస్ ఉంటాయి. మిగతా నాలుగు పేపర్లు అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్స్ పేపర్లు. ఒక్కో ఆప్షనల్‌కు రెండు పేపర్లు ఉంటాయి. మెయిన్‌‌స పేపర్లన్నీ డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటాయి.

ఇంటర్వ్యూ:
మెయిన్‌‌సలో పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో ఖాళీకి 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో ఇంటర్‌వ్యూకి ఎంపిక చేస్తారు. ఇది మూడొందల మార్కులకు జరుగుతుంది.
చివరకు మెయిన్‌‌స, ఇంటర్‌వ్యూలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ ప్రకారం ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.


రిఫరెన్‌‌స బుక్స్ (జీఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్)
* ప్రాథమికంగా అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ను అధ్యయనం చేయాలి.
ఇతర రిఫరెన్‌‌స బుక్స్:
* ఇండియా ఇయర్ బుక్
* యోజన ఎకనామిక్ సర్వే
* ది హిందూ దినపత్రిక
* ఇండియన్ పాలిటీ- లక్ష్మీకాంత్
* ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్- ఆర్.కె. అరోరా
* కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - పి.ఎం. భక్షి
* ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ - ఆర్.ఎస్. శర్మ
* మిడీవల్ ఇండియన్ హిస్టరీ - సతీష్ చంద్ర
* మోడ్రన్ ఇండియన్ హిస్టరీ - బిపిన్ చంద్ర
* మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్ - ఆర్. ఎస్. అగర్వాల్
* అనలిటికల్ రీజనింగ్ - పాండే
* క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్.ఎస్. అగర్వాల్
సిలబస్, పాత ప్రశ్న పత్రాలు

సివిల్స్ పరీక్ష విధానం
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్:
సబ్జెక్ట్ పేపర్ మార్కులు
జీఎస్ 1 200
ఆప్టిట్యూడ్ టెస్ట్ 1 200
మొత్తం 400

మెయిన్స్ ఎగ్జామినేషన్:
సబ్జెక్ట్ పేపర్లు మార్కులు
జీఎస్ 2 600
ఎస్సే 1 200
ఆప్షనల్ (1) 2 600
ఆప్షనల్ (2) 2 600
మొత్తం మార్కులు 2000
ఇంటర్వ్యూ: 300

ప్రిలిమ్స్ పేపర్లకు రెండు గంటల సమయం, మెయిన్‌‌స లోని ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయం లభిస్తుంది.
..................

సివిల్స్-2012 సమాచారం
* ప్రిలిమ్స్ నోటిఫికేషన్: ఫిబ్రవరి 4, 2012
* దరఖాస్తు గడువు తేదీ: మార్చి 5, 2012
* పరీక్ష తేదీ: మే 20, 2012
* మెయిన్‌‌స పరీక్ష: అక్టోబర్ 5, 2012 (21 రోజులు)
* వెబ్‌సైట్: www.upsc.gov.in

గురజాల శ్రీనివాసరావు
సబ్జెక్ట్ ఎక్స్‌పర్‌‌ట- జాగ్రఫీ, హైదరాబాద్
Related Posts Plugin for WordPress, Blogger...