Showing posts with label జనరల్ స్టడీస్. Show all posts
Showing posts with label జనరల్ స్టడీస్. Show all posts

Monday, January 16, 2012

అసలు "జనరల్ స్టడీస్" లో ఏముంటాయి?

అసలు జనరల్ స్టడీస్ అంటే అంటే ఏమిటి? దానికోసం ఎలాంటి అంశాలు చదువు కోవాలి? అనే అంశాలు తికమక పెడుతూ ఉంటాయి. ఈ నేపద్యంలో సివిల్స్ ప్రిలిమినరీ కోసం జనరల్ స్టడీస్ పూర్వ ప్రశ్నాపత్రాల ఆధారంగా ఎ ఎ అంశాలు ప్రిపేర్ అవ్వాలో వేటిలో పట్టు సాధించాలో కొద్ది సమాచారం మీకోసం.


అంశం
మార్కులు
భారత దేశ చరిత్ర 
5-7
ఇండియన్ నేషనల్ మూమెంట్
7-10
ప్రపంచ మరియు భారత దేశ భూగోళ శాస్త్రం
20-38
పాలిటి మరియు గవర్నెన్స్
12-14
ఎకానమి మరియు సాంఘీకాభివృద్ది
16-32
పర్యావరణ శాస్త్రం
10-15
జనరల్ సైన్స్ ఫిజిక్స్
10-12
జనరల్ సైన్స్ బయో సైన్సెస్
12-20
జనరల్ సైన్స్ కెమిస్ట్రీ
8- 11
జెనరల్ నాలెడ్జ్
2-5
కర్రెంట్ అఫ్ఫైర్స్
5-20

Friday, December 30, 2011

జనరల్ స్టడీస్ : పుస్తకాలు

జనరల్‌ స్టడీస్‌..ఈ పేరు, పేపర్‌ పలు విద్యాఉద్యోగ పరీక్షల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. సివిల్స్‌, గ్రూప్స్‌, జూనియర్‌ లెక్చరర్స్‌, ఎస్సై, కానిస్టేబుల్స్‌...ఇలా అనేక పరీక్షల్లో అభ్యర్థులు రాయాల్సిన కామన్‌ పేపర్‌ జనరల్‌ స్టడీస్‌. ఇందులో ఏ..ఏ..అంశాలు వస్తాయి. దీని పరిధి ఏంటి ! సివిల్స్‌కు, కానిస్టేబుల్స్‌కు ఒకే విధంగా ప్రిపేరవ్వాలా ! వంటి సందేహాలను తీర్చడానికి
ఇక్కడ అనేక విషయాలు ఇస్తున్నాం...
ఏ పోటీ పరీక్ష పరీక్షకైనా విద్యార్థి సిద్ధమవ్వాలంటే...మూడంచెలను పాటించాలి. 
1.సిలబస్‌ను చదివి, సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 
2.పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, అడిగిన తీరును అవగాహన చేసుకోవాలి. 3.సిలబస్‌లోని అన్ని జనరల్‌ ఏరియాస్‌ చదవటంతోపాటు పరీక్షలో రావటానికి అవకాశమున్న ధోరణులపై (పూర్వ ప్రశ్నల ఆధారంతో) దృష్టి పెట్టాలి.
------------------------------- @@@@@ ---------------------------

సివిల్స్‌కైనా, కానిస్టేబుల్‌ పరీక్షకైనా ఇదే విధానం వర్తిస్తుంది. కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. ముందుగా జనరల్‌ స్టడీస్‌లో ఏ విషయాలు వస్తాయి. వాటని ఎలా అధ్యయనం చేయాలన్నది తెలుసుందాం.
ఇందులో వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ-పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు...వీటన్నింటినీ చదివి, అర్థం చేసుకొని, ప్రతీదాంట్లో ప్రావీణ్యం సాధించటం ఎవరికైనా అసాధ్యం. మరేం చేయాలి ! తార్కికంగా చూసినా ఉన్న మార్గం - ట్రెండ్స్‌కు గుర్తించి, అనుసరించటమే. అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఇతర పోటీ పరీక్షల మాదిరి సివిల్స్‌, గ్రూప్స్‌లో జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నలను ఊహించటం కష్టమే. అంటే గతానుభవాల ఆధారంగా భవిష్యత్తులో ప్రశ్నలను ఊహించలేం.
ముఖ్యంగా మన జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కొన్ని ప్రశ్నల్ని సెట్‌ చేస్తారు. రీజనింగ్‌ విభాగమూ ఉంటుంది. అంటే వీటిని ముందుగా అర్థం చేసుకోవటం కష్టం. పేపర్‌ సెట్‌ చేసిన వారి ఉద్దేశం...సమాధానాన్ని కనిపెట్టడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవాలనే ఎత్తుగడ. ముఖ్యంగా ఈ తరహా సివిల్స్‌, గ్రూప్స్‌లో కనిపిస్తుంది. ఇక కానిస్టేబుల్స్‌, విఆర్‌ఓ, విఆర్‌ఎ, గ్రూప్‌-డి స్థాయి ఉద్యోగాల్లో జనరల్‌ స్టడీస్‌ పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది.
భారత జాతీయోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, సాంఘికార్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక ఆర్థిక అవగాహన, భూగోళవ్యవస్థ....మొదలైనవి అందరూ చదవాల్సిన అంశాలు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులు ఈ విషయాల్లో చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఇక ట్రెండ్స్‌ విషయానికొస్తే...వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, వీటికి తగిన నిర్వచనం ఇవ్వలేం. సిలబస్‌ అంటూ పేర్కొనలేం. గత సంవత్సరకాలంగా జరిగిన వర్తమాన వ్యవహారాలు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటించిన పథకాలు, పేరొందిన పథకాలు, వివిధ నివేదికలు, వాటి ప్రస్తావనలు, కమిషన్లు, దేశంలోని జరిగిన ముఖ్య సంఘటనలు...ఇలాంటివెన్నో. దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన విషయాల్ని నోట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఈ విభాగంలో మనం ఎంత సాధిస్తే అంత మంచిది. మంచి స్కోరింగ్‌కు అవకాశముంది. మోడల్‌ పేపర్లు సాధన చేస్తే అవగాహన వస్తుంది. గ్రిప్‌ దొరుకుతుంది.

------------------------------ @@@@@@@@ --------------------------

సివిల్స్‌, గ్రూప్స్‌కు సిద్ధమయ్యేవాళ్లు, తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి.
అవి...
  • ఎన్‌సిఈఆర్‌టి ప్రాథమిక పుస్తకాలు, 
  • తెలుగు అకాడమీ ప్రచురణలు, 
  • హ్యుమానిటీస్‌ (ఇండియన్‌ పాలిటీ, సోషియాలజీ)లలో అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ. పుస్తకాలు, 
  • తెలుగు, ఆంగ్ల వార్తపత్రికలు, 
  • పబ్లికేషన్స్‌ డివిజన్‌ 'ఇండియా ఇయర్‌బుక్‌', 
  • తెలుగు, ఇంగ్లీష్‌లలో ప్రచురితమయ్యే 'యోజన'.
తెలుగు మీడియం నేపథ్యమున్నవారు మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్‌ అంశాలతో తేలిగ్గా పరిచయం పెంచుకోవచ్చు. ముఖ్యంగా సివిల్స్‌ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2లో కొన్ని విషయాలపై ప్రశ్నలుంటున్నాయి. అవి... 
  • కాంప్రహెన్షన్‌, 
  • ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌, 
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, 
  • లాజికల్‌ రీజనింగ్‌, 
  • అనలిటికల్‌ ఎబిలిటి, 
  • డెసిషన్‌ మేకింగ్‌, 
  • ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, 
  • జనరల్‌ మెంటల్‌ ఎబిలిటి, 
  • బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), 
  • ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ ( పదో తరగతి స్థాయి).
గత ఏడాది కాంప్రహెన్షన్‌ విభాగం నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇది కొనసాగుతుంది. క్లిష్టత స్థాయి కూడా యధావిధిగా ఉంటుంది. గణితంలో ప్రశ్నల సంఖ్య అలాగే ఉండొచ్చు. కానీ క్లిష్టత స్థాయి పెరగవచ్చు. డెసిషన్‌ మేకింగ్‌లో ప్రశ్నలు కూడా పెరిగే అవకాశముంది. పూర్తిగా పరిణామశీల అంశాలతో కూడి వుంటుంది. అంటే ఇప్పటి పరిస్థితులతో అప్లై చేసి అడుగుతారు. ఈ పేపర్లో మంచి స్కోరింగ్‌ చేయాలంటే...కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇందులో అడిగే అంశాలన్నింటిలో పట్టు సాధించటం సాధ్యం కాదు. అందుకని గరిష్ట మార్కులు సాధ్యమయ్యే అంశాలను ఎంచుకోవటం మేలు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయకంగా స్కోరింగ్‌గా ఉన్న అంశాలను పరిష్టపరుచుకోవడం మంచింది. ఈ సూత్రం అన్ని రకాల పరీక్షలు రాసే అభ్యర్థులకు వర్తిస్తుంది. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. మన సమయాన్ని, శక్తిని వృధా చేసే వాటి నుంచి తప్పుకోవటం తెలివైన పని. లక్ష్యసాధనకు సులువైన పని.
క్వాంటిటేటివ్‌ విభాగంలో సంఖ్యలను అర్థం చేసుకోవటం జాతీయ స్థాయి పరీక్షల్లో కొంచెం కష్టమే. వీటి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అభ్యర్థులు సాధనతో ఈ కష్టమైన అంశాన్ని సలభతరం చేసుకోవచ్చు. ఈ విభాగాన్ని సెట్‌ చేయడం వెనుకున్న ఉద్దేశం...అభ్యర్థి సమయాన్ని హరించటమే. సరైన సాధన ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. వీలైనంత ఎక్కువ స్కోరింగ్‌ చేస్తే విజయానికి దగ్గరవుతాం. ఇంగ్లీష్‌పై పట్టులేనివారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పదో తరగతి లోపే ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు. అలాగే సిలబస్‌లో లేని అంశాలపై లోతైన అధ్యయనం చేయటం వృధా. మన ప్రిపరేషన్‌ క్లిష్టంగా మారుతుంది.
అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలు : 
  • ఆర్థమెటిక్‌లో ప్రాథమిక పుస్తకాలు. 
  • మౌలిక విషయాలు తెలిపే ఇంగ్లీష్‌ బుక్స్‌, 
  • ఇగ్నో ప్రచురించిన ఫంక్షనల్‌ ఇంగ్లీష్‌ పుస్తకాలు, 
  • బ్యాంకింగ్‌ పరీక్షల పాత మోడల్‌ పేపర్లు, 
  • ఇంగ్లీష-తెలుగు నిఘంటువు.
ఏ ఉద్యోగ పరీక్ష అయినా అడిగే విధానం ఒకేవిధంగా ఉంటుంది. కానీ ప్రశ్నల స్థాయి వేరు వేరుగా ఉంటుంది. సమయ నిర్వహణపై సాధన లేకుండా ప్రశ్నలను ఎదుర్కొనలేం. కాబట్టి మోడల్‌ పేపర్లు సాధన చేయాలి. తద్వారా సబ్జెక్‌పై, ప్రశ్నలపై అవగాహన ఏర్పడుతుంది. మనం ఇంకా ఎలా సిద్ధమవ్వాలి అన్నది తెలుస్తుంది.
 
ALL THE BEST

Sunday, December 25, 2011

క్విట్ ఇండియా ఉద్యమం.

జనరల్ స్టడీస్
ఉద్యమ సమీక్ష: ఉద్యమ పరమోద్దేశ్యమైన పూర్ణ స్వరాజ్‌ను ఉద్యమం సాధించలేకపోయింది.
1.
ఉద్యమ గమనం కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీసింది. ఉద్యమ వైఫల్యం ముఖ్యంగా కార్మిక కర్షక వర్గాలను గొప్పగా నిరాశపరిచింది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఈ వర్గాలు ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ప్రయత్నించాయి. ఫలితంగానే రైతాంగం కేవలం తనదైన అఖిల భారత కిసాన్ మహాసభను ఏర్పరుచుకోగలిగింది.
2.
కార్మిక వర్గాలలోను కాంగ్రెస్ పట్ల నిరాసక్తత ఉద్యమ వైఫల్యంవల్ల చోటు చేసుకుంది. కార్మిక సంస్థలు ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లపై కాంగ్రెస్ తన పట్టును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యమ వైఫల్యం వల్ల ఎఐటియుసిలో కాంగ్రెస్ స్థానంలో కమ్యూనిస్టులు బలపడ్డారు.
సహాయ నిరాకరణోద్యమం వైఫల్యం ఏవిధంగానైతే స్వరాజ్ పార్టీ ఆవిర్భావానికి దారి తీసిందో శాసనోల్లంఘటన ఉద్యమ వైఫల్యం కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఆవిర్భావానికి కారణమైంది. ఉద్యమ వైఫల్యంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ వాదులు ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ్, అచ్యుత పట్వర్ధన్ మరియు అరుణా అసఫలీలు 1934 బాంబే సమావేశంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించారు.
ఉద్యమం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయినప్పటికీ ప్రతికూల ఫలితాలనిచ్చినప్పటికీ కొంతమేరకు చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది.
ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ ఒక పరిపూర్ణ ప్రజా విప్లవ సంస్థగా అవతరించింది. ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ పంథాలోనే స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది. స్వయం పరిపాలన, స్వదేశీ స్థానంలో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యానికి పిలుపునిచ్చింది.
ఉద్యమంలో సహాయ నిరాకరణకు బదులు శాసనోల్లంఘనచోటుచేసుకోవడంతో కాంగ్రెస్ పోరాట పంథాలోనే స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది.
స్వదేశీ వనరులు, స్థానికులకు ఉపకరించాలనే వాదాన్ని ఉద్యమం సమర్ధవంతంగా తమ ఉప్పు సత్యాగ్రహాలలో చాటి చెప్పగలిగింది. స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారిగా స్ర్తిలు చైతన్యవంతమైన పాత్రను పోషించడానికి మరియు ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ఉద్యమం తోడ్పడింది. స్వాతంత్రోద్యమ భావాలు సరిహద్దు ప్రాంతాలైన ఆఫ్గనిస్తాన్‌లోకి ప్రవేశించడానికి కూడా ఉద్యమమే కారణమైంది.
ఉద్యమం తన తక్షణాశయాలను సాధించడంలో విఫలమైనప్పటికీ ఒక దశానుక్రమంగా మరియు క్రమానుగతంగా కాంగ్రెస్ బలపడడానికి తోడ్పడిందని చెప్పవచ్చు.
క్విట్ ఇండియా ఉద్యమం
స్వాతంత్రోద్యమంలో చిట్టచివరి ఉద్యముమ. గొప్ప విశిష్టతను సంతరించుకున్నది. పోరాటంలో నాయకత్వం లేని ఉద్యమంగా ఇది ప్రారంభమైంది. అహింసా వాదియైన గాంధీ ఒక అరాచక వాదిగా మారడానికి ఉద్యమం కారణమైంది.
ఉద్యమానికి దారి తీసిన కారణాలు: ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులు 2 ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ముడిపడి ఉన్నాయి. 1939లో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాలతో సంప్రదించకుండానే గవర్నర్ జనరల్ లిన్ లిత్‌గో భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామురాలిగా చేస్తూ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యాయి. రాజకీయాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. యుద్ధ నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించినందుకుగాను ఏమి ప్రతిఫలంగా ఇవ్వబోతున్నారో చెప్పకుండానే భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వాములు చేయడం,పైగా అత్యంత కీలక రక్షణ శాఖను భారతీయులకు ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అభ్యంతరకరమైంది.
1940
ఆగస్టు ప్రతిపాదనల్లో గవర్నర్ జనరల్ లిన్‌లిత్‌గో రక్షణ శాఖ తప్పించి మిగిలిన శాఖలను ఇవ్వడానికి అంగీకరించడం, యుద్ధానంతరం అధినివేశ ప్రతిపత్తి కల్పించడానికి మరియు రాజ్యాంగ నిర్మాణ సమితి ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీని నిరాశపరచడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలను తిరస్కరించింది. భారత రాజకీయాలలో నెలకొని ఉన్న పరిస్థితి గాంధీకి ఒక నైతిక సమస్యగా పరిణమించింది. తనను తాను రక్షించుకోలేని ఇంగ్లండ్ కనీసం భారతదేశాన్ని రక్షించుకునే బాధ్యతను భారతీయులకు ఇవ్వకపోవడం గాంధీని కలవరపరిచింది. ఈ స్థితిలో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్య వాదము గణనీయంగా విస్తరించింది. ఆసియాలో ఇంగ్లండ్ వలసలైన ఇండోనేషియా, మలయా ద్వీపములు మరియు సింగపూర్‌ను జపాన్ ఆక్రమించింది. భారతదేశం కూడా బ్రిటిష్ వారి వలస కనుక దాడి తప్పదని హెచ్చరించింది. పైగా విశాఖపట్నం రేవు పట్టణాలపై దాడికి పాల్పడింది. జపాన్ దురాక్రమణ జరిగితే భారతదేశ పరిస్థితి ఏమవుతుందో అనేది కాంగ్రెస్‌కు సమస్యగా పరిణమించింది.
1942
మార్చి 24న వచ్చిన క్రిప్స్ రాయబారము భారతీయ నాయకత్వాన్ని నిరాశపరిచింది. 1940 ఆగస్టు ప్రతిపాదనల్ని పునరుద్ఘాటించిన క్రిప్స్ సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తూ మైనారిటీ ముస్లింలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికార ముందని ప్రకటించాడు. పరోక్షంగా పాకిస్తాన్ అన్న ఆలోచనకు మద్దతు పలికాడు. తీవ్ర నిరాశకు గురైన గాంధీ ప్రతిపాదనలను దివాళా తీసిన బ్యాంకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్స్‌గా విమర్శించాడు. పరిష్కార మార్గంగా ఉద్యమానికి సిద్ధమైనాడు.
ఉద్యమానికి ఇతర కారణాలు కూడా తోడ్పడ్డాయి.
1.
ప్రపంచ యుద్ధం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. కార్మిక వర్గాల్లో అశాంతి నెలకొన్నది
2.
యుద్ధ సమయంలో అధికార రహస్యాల చట్టాన్ని ప్రయోగించి మానవ హక్కులు హరించివేయబడ్డాయి.



 

Friday, May 27, 2011

సమాచార హక్కు చట్టం ..!!


1. ఇది ఎప్పుడు అమలులోకి వచ్చింది?
అక్టోబర్‌ 12వ తేది,2005 న ఇది అమలులోనికి వచ్చింది (జూన్‌15, 2005న చట్టబద్ధమైన నాటి నుండి 120 వ రోజున) వచ్చింది. కొన్ని ఏర్పాట్లు తక్షణమే అమలులోకి వచ్చాయి. ఉదాహరణకు ప్రభుత్వ అధికారుల బాధ్యతలు [ఎస్‌.4(1)], పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార ఆధికారులు [ఎస్‌.5(1) మరియు 5(2)], కేంద్ర సమాచార కమీషన్‌ ఏర్పాటు (ఎస్‌12 మరియు 13), రాష్ట్ర సమాచార కమీషన్‌ ఏర్పాటు (ఎస్‌.15 మరియు 16). రహస్య సమాచార, భద్రతా వ్యవస్థలకు (ఎస్‌.24) ఇది వర్తించదు. చట్టనియమాలను పొందుపరచే ఏర్పాటు జరిగింది (ఎస్‌.27మరియు 28).


2. ఎవరికి వర్తిస్తుంది?
జమ్మూ కాశ్మీరు రాష్ట్రమునకు తప్ప భారత దేశప్రజలందరికి ఈ చట్టం వర్తిస్తుంది [ఎస్‌.(12)].


3. సమాచారం అనగానేమి?
సమాచారం అనగా రికార్డులు, దస్తావేజులు (డాక్యుమెంట్లు), మెమోలు, ఇ-మెయిల్స్‌, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, అందరికీ తెల్పే పత్రం (సర్క్యులర్లు), ఉత్తర్వులు, దినచర్య పుస్తకాలు (లాగ్‌ బుక్స్‌), ఒప్పందాలు(కాంట్రాక్టులు), నివేదికలు(రిపోర్టులు), పత్రాలు, నమునాలు, ఏదేనా ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉండే దత్తాంశాల (డేటా మెటీరియల్‌)తో సహా ఏ రూపంలోనైనా ఉండే ఏదేని అంశాలు, ఆ సమయంలో అమలులోఉన్న ఏదైనా ఇతర శాసనం క్రింద ప్రభుత్వ అధికార వర్గం తెలుసుకొనదగినట్టి ఏదైనా ప్రవేటు సంస్థకు చెందిన సమాచారం, ఫైలు వివరణలు (ఫైల్‌ నోటింగ్‌ లు) ఇందులో చేరవు [ఎస్‌.2(ఎఫ్‌) ].


4. సమాచారహక్కు అనగానేమి?
ఇందులో ఈ దిగువ హక్కులు చేరి ఉన్నాయి-
  • పనులను, దస్తావేజు(డాక్యుమెంట్లు)లను, లిఖిత నమోదు(రికార్డు)లను తనిఖీచేసే హక్కు.
  • డాక్యుమెంట్లు లేదా రికార్డుల నుండి కావలసిన అంశాలను నోట్‌ చేసుకోవడం, ఉదాహరణ భాగాలను రాబట్టుకోవడం, ధృవీకృత నకళ్ళను తీసుకొనే హక్కు.
  • సామగ్రి యొక్క ధృవీకృత మాదిరీలను తీసుకొనేహక్కు.
  • ముద్రిత ప్రతుల, డిస్కెట్స్‌, ఫ్లాపీలు, టేపులు, వీడియో కేసెట్ల రూపంలో లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్‌ విధానంలో లేదా ముద్రిత ప్రతుల ద్వారా సమాచారం పొందవచ్చు. [ఎస్‌.2( j )]


5. అధికారులు వారి విధులు

ప్రభుత్వ(పౌర) అధికార వర్గం యొక్క విధులేమిటి?
ఈచట్టం అమలులోకి వచ్చిన120 రోజులలోపల ఈక్రింది వాటిని ప్రచురించాలిః-
1.  ఆ అధికారవ్యవస్థ యొక్క కార్యక్రమాలు మరియు విధులు;
2.  అధికారులు, ఉద్యోగస్థుల అధికారాలు మరియు విధులు;
3.  పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన మార్గాలతోబాటు నిర్ణయాత్మక ప్రక్రియతో అనుసరించే విధానాలు;
4.  వ్యవస్థ యొక్క కార్యక్రమ నిర్వహణలో నిర్వర్తించే సూత్రాలు;
5.  దీనిలో గల ఉద్యోగుల కార్యక్రమం అమలులో వినియోగించే నియమాలు, నిబంధనలు, సూచనలు, నియమ సంపుటులు ( మేన్యుయళ్ళు), రికార్డులు;
6.  దాని దగ్గర లేదా అజమాయిషీలో ఉన్న దస్తావేజుల లేదా పత్రాల రకాలకు సంబంధించిన ప్రకటన;
7.  దాని విధానాల రూపకల్పన కోసం ,లేక వాటి అమలు కోసం పౌర సభ్యులతో సంప్రదింపులు జరిపేటందుకు లేక వారి ప్రాతినిధ్యం స్వీకరించేటందుకు  ఏదైనా పద్ధతి ఉన్నట్లయితే దాని వివరాలు;
8.   దానిలో భాగంగా గాని, లేక సలహాలు ఇచ్చేటందుకు గాని, ఇద్దరులేక అంతకన్నా ఎక్కువ  సభ్యుల తో మండళ్ళు(బోర్డులు), పరిషత్తులు(కౌన్సిళ్ళు), సమితులు(కమిటీలు),ఇతర సంస్థలు ఏర్పాటై ఉంటే వాటి వివరాల ప్రకటన. ఆయా సమావేశాలగురించి ప్రజలకు తెలుస్తున్నదీ  లేనిది సమావేశపు వివరణలు అందుబాటులో ఉన్న విషయం;
9.  అధికారుల, ఉద్యోగ దర్శిని;
10. అధికారులు, ఉద్యోగులలో ప్రతి ఒక్కరు తీసుకునే నెలవారి వేతనము, నిబంధనల ప్రకారం  చెల్లించే పరిహార విధానం;
11.  అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యెయాలు, జరిపిన పంపిణీలకు సంబంధించిన నివేదికల వివరాలను సూచిస్తూ ఆ యంత్రాంగంయొక్క ప్రతినిధి సంస్థలు ప్రతీదానికి కేటాయించిన బడ్జెట్‌ వివరాలు;
12.  ఆర్ధిక సహాయ (సబ్సిడీ )కార్యక్రమాల అమలుతీరు, ఆయా కార్యక్రమాలకు కేటాయించిన సొమ్ము మొత్తం, లబ్ధిదారుల వివరాలు;
13.  అది మంజూరు చేసిన రాయితీలు, అనుమతులు, అధికారికనిధులను పొందుతున్న గ్రహీతల వివరాలు;
14.  ఎలక్ట్రానిక్‌ రూపంలోకి కుదించిన అందుబాటులోను, ఆధీనంలోఉన్నసమాచారం;
15.  ప్రజా వినియోగం కోసం గనుక నిర్వహిస్తే గ్రంధాలయం, పఠనాలయం యొక్క పని గంటలతోబాటు పౌరులకు అందేసమాచారం కొరకు అందుబాటులోగల సౌకర్యాల వివరాలు;
16. పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతరవివరాలు. [ ఎస్‌.4(1)(బి) ]



ప్రభుత్వ అధికార వర్గం అనగానేమి?
ఏ అధికార వర్గమైనా, స్వపరిపాలన మండలి లేదా సంస్థను ఏర్పరచడం లేదా నెలకొల్పడాన్నే ప్రభుత్వ అధికార వర్గం అంటారు. [ఎస్‌.2(హెచ్‌) ]
  • రాజ్యాంగం ద్వారా లేదా దాని ఆధీనంలో;
  • పార్లమెంటు రూపొందించిన ఏదైనా ఇతర శాసనం;
  • రాష్ట్ర శాసన సభ లో చేసిన ఏదైనా ఇతరశాసనం;
  • ప్రభుత్వం జారీ చేసిన సముచితమైన ప్రకటన లేదా ఉత్తరువు మరియు ఇంకేదేని చేరి ఉంటాయి-
ఎ. స్వంత, నియంత్రణ లేదా గణనీయమైన ఆర్ధికసహాయాన్ని పొందిన సంస్థ.
బి.సంబంధిత ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గణనీయమైన ఆర్ధిక సహాయాన్ని పొందిన ప్రభుత్వేతర సంస్థ.



ప్రభుత్వ సమాచార అధికారులెవరు(పిఐఒలు)?
అన్నిపరిపాలనా విభాగాలు, లేదా చట్టం క్రింద కోరే సమాచారాన్ని ప్రజలకు అందించే కార్యాలయాలలో పనిచేసే అధికారులను ప్రభుత్వ (పౌర) సమాచార అధికారులుగా ప్రభుత్వ అధికార వర్గం ద్వారా పేర్కొనబడింది. ప్రభుత్వ (పౌర) సమాచార అధికారి తన అతను/ఆమె యొక్క కర్తవ్య నిర్వహణలో ఏ అధికారి సహాయమైన కావాలనుకున్నప్పుడు అన్ని విధాల సహాయాన్ని పొందే ఉద్దేశంతో చట్టాన్ని అనుసరించి శాసన నిబంధనకు లోబడి యేర్పరిస్తే అతను/ఆమెను సహాయ ప్రభుత్వ(పౌర) సమాచార అధికారిగా చెప్పవచ్చును.



పౌరసమాచార అధికారియొక్క విధులేమిటి?
  • సమాచారం కోసం వ్రాత పూర్వక విజ్ఞప్తినివ్వలేకపోతే ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని లిఖితరూపంలో గ్రహించడానికి తగు సహాయాన్ని తీసుకోవాలి.
  • మరో ప్రభుత్వాధికార వర్గం వద్దఉన్న లేదా  విషయాంశానికి సన్నిహిత సంబంధంకల్గి ఉన్న సమాచార విజ్ఞప్తిని (5) రోజుల లోపల సముచిత సమాచారాన్ని పొంద వలసిన వేరొక ప్రభుత్వాధికార వర్గమునకు తగిన అభ్యర్ధనతో బదిలీచేసి పౌర సమాచార అధికారి ఆ విషయాన్ని వెనువెంటనే దరఖాస్తుదారునికి తెలియజేయాలి.
  • ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి తనకు సహాయం కావాలనుకున్నప్పుడు ఏ ఇతర అధికారికైన అతడు/ఆమె కర్తవ్య నిర్వహణను అప్పగించవచ్చును.
  • విజ్ఞప్తి అందిన వెంటనే వీలయినంత వేగంగా, మరియు విజ్ఞప్తి అందిన (30) రోజుల లోపల సమాచారాన్ని ఇవ్వడం, సూచించిన రుసుమును చెల్లించే సమాచారాన్నివ్వడం, ఎస్‌.8 లేదా ఎస్‌.9 లోతెల్పిన విధంగా తగిన కారణాన్ని చెబ్తూ నిరాకరించడం ప్రభుత్వ (పౌర) సమాచార అధికారి చేయాలి.
  • ఒక వ్యక్తి యొక్క జీవితానికి లేదా స్వఛ్ఛకు సంబంధించిన అభ్యర్ధన అందిన (48)గంటల లోపల  సమాచారాన్ని ఇవ్వాలి.
  • సూచించిన కాలపరిమితిలోపల అభ్యర్ధనకు తగిన నిర్ణయాన్ని ఇవ్వలేనప్పుడు విజ్ఞప్తిని తిరస్కరించినట్లుగా భావించవచ్చును.
  • విజ్ఞప్తిని గనుక తిరస్కరిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి, విజ్ఞప్తిదారునికి (1)  నిరాకరించడానికి గల కారణాలు,
  • (2) తిరస్కరించిన అభ్యర్ధనకు ఎప్పటిలోగా అపీలు చేసుకోవచ్చునో దానికి తగిన నిర్ణీత కాలవ్యవధిని చెప్పడం, (3)విచారణాధికారి వివరాలు తెలియజేయాలి.
  • ప్రభుత్వ అధికార వనరులను సరిపోల్చలేని విధంగా మళ్ళించవలసి రావటం రికార్దుల పరిరక్షణ, భద్రతకు హానీకరమైనదయితే తప్ప కోరిన సమాచారాన్ని సాధారణంగా అందజేయడమౌతుంది.
  • పాక్షికంగా సమాచారాన్ని అంద జేయాల్సినప్పుడు , ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి దరఖాస్తుదారునికి ప్రకటనద్వారా తెలియజేయడం ;
ఎ. రికార్డులోని కొంత భాగాన్ని అభ్యర్దించినప్పుడు పంపకానికి సంబంధించిన సమాచారం ఉన్నట్లైతే మినహాయించి వెల్లడిచేయవచ్చును;
బి. వాస్తవాంశాల పరిశీలనలను కలుపుకొని, నిర్దేశితవిషయానికి సంబంధించిన ఆయా పరిశీలనల ఆధారంగా నిర్ణయానికి కారణాలను తెల్పాలి;
సి. నిర్ణయమిచ్చిన వ్యక్తి యొక్క  పేరు ,హోదా;
డి.అతడు/ఆమెకు గణనచేసిన రుసుము,దరఖాస్తుదారుడు జమచేయవలసిన మొత్తం రుసుము  వివరాలు;మరియు
ఇ. అతను/ఆమె హక్కులను గౌరవిస్తూ వెల్లడి చేయలేని సమాచార భాగ నిర్ణయాన్ని సమీక్షించి,      రుసుము మొత్తాన్ని విధించడం లేదా పొందవలసిన మేరకు సమాచారాన్ని అందించాలి.

  • తృతీయ పక్షానికిచెందిన లేదా అందించిన సమాచారం , అతి రహస్యమైనదిగా తృతీయ పక్షం  భావించినట్లయితే ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి సమాచారం అందిన (5)రోజులలోగా సదరు తృతీయ పక్షానికి వ్రాతపూర్వక ప్రకటనను ఇవ్వాలి. వారి విన్నపాన్ని పరిగణనలోకి తేసుకోవాలి.
  • ప్రకటన అందిన (10) రోజులలోగా సమాచార వెల్లడి ప్రతిపాదనపై తృతీయ పక్షానికి అవకాశం ఇవ్వాలి.



6. అందుబాటులో గల సమాచారం ఏముంది?

1. బహిరంగ వెల్లడికి మినహాయింపులేమిటి?
వెల్లడిచేయడంలో ఈ క్రింది మినహాయింపులు ఇవ్వబడినవి.(ఎస్‌.8)
1. భారతీయ ఐక్యతకు, సార్వభౌమత్వానికి ప్రతికూల పరిణామాలను కల్గించే సమాచారం, దేశ భద్రతకు,        కీలకమైన,   రాష్ట్రవైజ్ఞానిక లేదా ఆర్ధిక ప్రయోజనాల, విదేశీ రాజ్య సంబంధంలేదా నేరాలను                     ప్రేరేపించడంలో త్రోవకల్పించే సమాచారం, వెల్లడికి మినహాయింపులు.
2 ఏదైనా న్యాయ స్థానం లేదా ట్రిబ్యునల్‌ (అధికరణస్థానం) ప్రచురించ కూడదని నిరోధించిన, లేదా           చట్టంనిషేధించిన  విషయం న్యాయస్థానాల  ధిక్కారం లోకి వస్తుందనుకుంటే అ సమాచారం.
3. కేంద్ర శాసనమండలి (పార్లమెంట్‌) లేదా రాష్ట్ర శాసనసభల ప్రత్యేక హక్కుల  ఉల్లంఘనకు కారణమయ్యే సమాచారం;
4. వాణిజ్య విశ్వసనీయత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించిన , వెల్లడిచేసే సమాచారం   పోటీ రంగంలో తృతీయ పక్షానికి హానీ కల్గుతుందనుకుంటే ఆ సమాచారం. విస్తృత ప్రజాప్రయోజనాల అధిపత్రం (వారంట్‌) దృష్ట్యా సమర్ధమైన అధికార వర్గం వెల్లడి చేయాల్సిందేనని భావించినట్లైతే  అటువంటి సమాచారాన్ని  వెల్లడించవచ్చును;
5.విశ్వాసబద్ధమైన సంబంధరీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న సమాచారం  విస్తృత          ప్రజా    ప్రయోజనాల అధిపత్రం (వారంట్‌) దృష్ట్యా సమర్ధమైన అధికార వర్గం వెల్లడి చేయాల్సిందేనని         భావించినట్లైతే అటువంటి సమాచారాన్ని  వెల్లడించవచ్చును;
6. విదేశీ ప్రభుత్వం నుంచి  అందిన రహస్య సమాచారం;
7. ఏదైన సమాచారం వెల్లడి వల్ల ఏ వ్యక్తి ప్రాణానికైనా లేక భౌతిక భద్రత కైనా హానీ కల్గుతుందనుకుంటే
   అలాంటి సమాచారం. చట్టాల అమలు, భద్రతా ప్రయోజనాల కొరకు రహస్య  సమాచారం అందించిన లేక సహాయపడిన వారిగుర్తింపునకు దారితీసే సమాచారం;
8. దర్యాప్తు ప్రక్రియను, నేరస్తులను పట్టుకునేందుకు అభియోగం నడపడానికి అవరోధాలు కల్పించే                సమాచారం;
9.మంత్రి మండలి , కార్యదర్శులు , ఇతర అధికారుల సమాలోచనలతో సహా మంత్రి మండలి(క్యాబినెట్‌)      పత్రాలు;
10.ప్రజా కార్యకలాపాలకు, ప్రయోజనాలతో నిమిత్తంలేని వ్యక్తిగత సమాచారం, లేదా వ్యక్తిగత జీవితాలలోకి      నిష్కారణంగా తొంగిచూసే  అవకాశం కల్పించే సమాచారం;
11. పై మినహాయింపు జాబితాతో నిమిత్తమలేకుండ రక్షిత ప్రయోజనాలకు కల్గే హానికన్నా ప్రజా                   ప్రయోజనాల దృష్ట్యా మేలు ఎక్కువనుకుంటే సమర్ధమైన అధికార వర్గం సమాచారాన్ని         అందించవచ్చును;



2. కొంతభాగాన్ని మాత్రమే వెల్లడిచేసే అనుమతి ఉందా?
కోరిన రికార్డులో  వెల్లడి నుంచి మినహాయింపు పొందిన భాగాన్ని సమాచారాన్ని అందించడం. (ఎస్‌.10)



3. సమాచార చట్టంనుండి మినహాయింపు గల వారెవరు?
 కేం ద్ర రహస్య సమచార, భద్రాతా సంస్థలు రెండవ షెడ్యూల్‌ లో నిర్దిష్టంగా ఉన్నటు వంటి ఐబి.ఆర్‌  అండ్‌ఎడబ్ల్యు, ఆదాయ సంపత్తి కార్యకేంద్రం    (రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌) ,కేంద్ర ఆర్ధిక ప్రజ్ఞా సంపత్తి కార్య కేంద్రం  (సెంట్రల్‌ ఎకనామిక్స్‌     ఇంటెలిజెన్స్‌ బ్యూరొ ) ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, మాదకద్రవ్యాల నియంత్రణ కార్యకేంద్రం (నార్కోటిక్స్‌   కంట్రోల్‌ బ్యూరొ), ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ , ప్రత్యేక సరిహద్దు దళం (స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌),   సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్‌.ఎఫ్‌), కేంద్ర ప్రత్యేక భద్రతా దళం  (సి.ఆర.పి.ఎఫ్‌), ఐ.టి.బి.పి,   సి.ఐ.ఎస్‌.ఎఫ్‌, ఎన్‌.ఎస్‌.జి, అస్సామ్‌ రైఫిల్స్‌ , ప్రత్యేక సేవా కార్యకేంద్రం( స్పెషల్‌ సర్వీస్‌ బ్యూరొ), ప్రత్యేక   విభాగం- కేంద్ర రహస్య సమాచార సంచాలక కార్యాలయం (సిఐడి), అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ,  నేరవిభాగం- కేంద్ర రహస్య సమాచార సంచాలక కార్యాలయం - కేంద్రవిభాగం, దాద్ర అండ్‌ నాగర్‌  హవేలి  మరియు ప్రత్యేకశాఖ, లక్షద్వీప్‌  పోలీస్‌. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రకటింపబడిన ప్రత్యేక సంస్థలను మినహాయించడమౌతుంది. అవినీతి ఆరోపణలు,  మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించినవి  ఉంటే   ఆయా సంస్థల సమాచారాన్ని అందించడంలో మినహయింపు ఉన్నప్పటికి అది వర్తించదు. ఇంకను కేంద్ర లేదా రాష్ట్ర సమాచార కమీషన్‌ ఆమోదమైన తర్వాతనే మానవ హక్కుల మూల్యాంకనానికి సంబంధించిన ఆరోపణల వ్యవహారం ఉన్నట్లయితే ఆ  సమాచారాన్ని ఇవ్వాలి. (ఎస్‌.24)

7. సమాచారం కోసం అభ్యర్ధించే విధానం
      1. సమాచారం కొరకు అభ్యర్ధిస్తూ చేసే దరఖాస్తు విధానమేమిటి?
          లిఖిత పూర్వకంగా గానీ , లేదా  ఎలక్ట్రానిక్‌ రూపంలో గానీ ఇంగ్లీష్‌ , హిందీ లేదా స్థానిక అధికార                       భాషలో గానీ ,  ప్రభుత్వ సమాచార అధికారికి వివరాలను దరఖాస్తు చేస్తూ సమాచారాన్ని కోరడం,
       2. సమాచారం కోరడానికి గల కారణాలను తెలియజేయవలసిన అవసరంలేదు;
       3. నిర్ణీత రుసుమును చెల్లించవలెను (దారిద్ర్య రేఖకు దిగువగల వర్గం వారుతప్ప).
     2. సమాచారాన్ని పొందడానికి గల కాల పరిమితి ఏమిటి?
       1. దరఖాస్తు చేరిన (30) రోజుల లోగా సమాచారమివ్వాలి.
       2. ఒక వ్యక్తి జీవితం లేదా స్వేచ్చకు సంబంధించిన విషయంలో (48)గంటలలోపల సమాచారమివ్వాలి.
       3. సహాయ సమాచార అధికారికి సమాచారం కోసం ఇచ్చిన దరఖాస్తు విషయంలో సమాధానం
         చెప్పడానికి (5)రోజుల వ్యవధిని కలుపుకోవాలి.
      4. తృతీయ పక్షం గనుక సమాచారాన్ని ఉన్నట్లయితే (40) రోజుల కాలవ్యవధిని (గరిష్ట కాలవ్యవధి,
        తృతీయ పక్షానికి ఇచ్చిన సమయం కలుపుకొని) ఇవ్వాలి
    5. కేటాయించిన వ్యవధిలో సమాచారాన్ని అందించకపోతే గనుక అభ్యర్ధనను తిరస్కరించినట్లుగా            భావించవచ్చు.

      3. చెల్లించవలసిన రుసుము ఎంత?
      1. సముచిత మైన నిర్దిష్ట రుసుమును దరఖాస్తు కొరకు ఉండాలి.
      2. ఇంకను ఎక్కువ రుసుము చెల్లించాలంటే వ్రాతపూర్వకంగా, లెక్కించిన వివరాలతో బాటు ఎంత మొత్తం         చెల్లించాలో తెలియజేయాలి.
      3. అభ్యర్ధిదారుడు నిర్ణయంపై పునర్విచారణ కోరితే ప్రభుత్వ సమాచార అధికారి విధించిన రుసుముతో         సరియగు విచారణాధికారికి దరఖాస్తు చేయాలి.
      4. దారిద్ర్య రేఖకు దిగువగల వర్గం వారు ఎలాంటి రుసుమును చెల్లించవలసినవసరంలేదు.
      5. కాల వ్యవధిలోగా ప్రభుత్వ సమాచార అధికారి , దరఖాస్తుదారునికి సమాచారాన్ని ఇవ్వలేని పక్షంలో         ఉచితంగానే సమాచారాన్ని ఇవ్వాలి.
 
 4.సమాచారాన్ని  ఇవ్వడంలో తిరస్కరణకు గల కారణాలేమిటి?

      1. మినహాయింపులోగల సమాచారాన్ని వెల్లడించరాదు. (S.8)
      2. ఇతర రాష్ట్రం లోగల ఏ వ్యక్తి కాపీరైటుగల వాటి సమాచారం (S.9) 
Related Posts Plugin for WordPress, Blogger...