Thursday, September 14, 2017

సివిల్స్‌ 2018 కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

సివిల్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకోని సందిగ్ధంలో ఉన్నవారు నిజానికి  ప్రిలిమినరీలో అర్హత సాధించినట్లుగా భావించి, మెయిన్స్‌కు సన్నద్ధత ప్రారంభించడం మంచిది. ఈ ఆలోచన ఆచరణీయమేనా అనిపించొచ్చు కానీ, అమలుపరిస్తే వచ్చే ఏడాది విజయం సాధించే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. 
ప్రిలిమినరీ సిలబస్‌లోని అంశాలు మెయిన్స్‌ సిలబస్‌లో 75% కలుస్తున్నాయి.
కరంట్‌ అఫైర్‌ నుంచి జీకే, జాగ్రఫీ... ఇలా రెండు పరీక్షలకూ చదవాల్సిన అంశాలున్నాయి. వాటి జాబితాను ఇక్కడ చూడండి.

మెయిన్స్‌ సన్నద్ధత ప్రిలిమ్స్‌తో పోల్చినపుడు ఏవిధంగా భిన్నం?
మెయిన్స్‌కూ, ప్రిలిమ్స్‌కీ సన్నద్ధతకు సంబంధించిన పునాది ఒకేలా ఉంటుంది. కాన్సెప్టులను అర్థం చేసుకోవడం ముఖ్యం. కాన్సెప్టులను అర్థం చేసుకున్నాక ప్రిలిమ్స్‌ సన్నద్ధతలో వాస్తవాధారిత అంశాలుండాలి. అదే మెయిన్స్‌కు అయితే వాస్తవాలు, అభిప్రాయాలు, విశ్లేషణలను జోడించాలి.
అయినప్పటికీ చాలామంది అభ్యర్థుల్లో కొన్ని సందేహాలున్నాయి. అవి..
మెయిన్స్‌ సన్నద్ధత ప్రిలిమ్స్‌తో పోల్చినపుడు ఏవిధంగా భిన్నం?
ఒక అంశాన్ని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లకు చదవడం ఎలా? వాటిని ఎలా అనుసంధానించి చదవాలి?
మెయిన్స్‌లో పరిశీలించేవేమిటి? సమాధానాలను ఎలా రాయాలి?
వీటికి తగిన సమాధానాలను అన్వేషిస్తే నిశ్చింతగా పరీక్షకు సిద్ధం కావొచ్చు.
ఒక అంశాన్ని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లకు చదవడం ఎలా? వాటిని ఎలా అనుసంధానించి చదవాలి?
ప్రాథమికాంశాలను పూర్తిచేశాక అభ్యర్థి సహజంగానే ముఖ్యమైన అంశాల చిత్రాన్ని మనసులోనే రూపొందించుకోవాలి. అది వర్తమాన వ్యవహారాలవైపునకు దారి తీస్తుంది. నిజానికి ప్రశ్నలు వర్తమాన వ్యవహారాల ఆధారంగానే ఉంటాయి. ఒకసారి టాపిక్‌లను ఎంపిక చేసుకుంటే సన్నద్ధత ప్రారంభించవచ్చు.
ఉదాహరణకు- ఇటీవల వార్తాపత్రికల్లో ఆర్టికల్‌ 35-ఏ గురించి చదువుతున్నాం.
ఈ అంశంపై కింది ప్రశ్నలు వేసుకుని, వాటికి సమాధానాలను వివరంగా సేకరించాలి.
ఆర్టికల్‌ 35-ఏ ఏమిటి? ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది?
జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి దాని ప్రాముఖ్యం ఏమిటి?
ఈ ఆర్టికల్‌ ఎందుకు చర్చనీయాంశమవుతోంది?
దీన్ని మార్చడానికి వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
ఈ సమాచారంలో వాస్తవాధారిత ప్రాథమికాంశాలు ప్రిలిమ్స్‌కు ఉపయోగపడతాయి. మిగిలిన అంశాలైన కాలక్రమానుగత పరిణామాలూ, వివిధ సంస్థల అభిప్రాయాలూ, చర్చలూ... ఇవన్నీ మెయిన్స్‌ పరీక్ష కోణంలో ముఖ్యమైనవి.

మెయిన్స్‌లో పరిశీలించేవేమిటి? సమాధానాలను ఎలా రాయాలి?
సివిల్స్‌ ప్రధాన పరీక్షను మూల్యాంకనం చేసేవారు జవాబు పత్రంలో ‘పాయింట్ల’ కోసం చూస్తారు. అది 20 మార్కుల ప్రశ్న అయితే వీలైనన్ని పాయింట్లు ఉండాలని ఆశిస్తారు. దీన్ని ఓ ఉదాహరణ ద్వారా చూద్దాం.
ఇటీవల నాగార్జున సాగర్‌కు 29 కి.మీ. వాయవ్యదిశలో భూకంపం సంభవించింది. దీన్ని జాతీయ జియోఫిజికల్‌ పరిశోధన కేంద్రం (NGRI) జులై 26న కనిపెట్టింది. ఈ పరిణామం రెండు అంశాలను (భారీ రిజర్వాయర్ల వద్ద భూ ప్రకంపనాలను పరిశీలించటం, పెద్ద ఆనకట్టలకు సంబంధించిన పర్యావరణ అంశాలపై దృష్టి పెట్టాలనే భావన) వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో రాదగ్గ ప్రశ్న-
Q : 'WHAT ARE THE ECOLOGICAL IMPACTS OF LARGE DAMS ?'
A: Experience from all over the world has shown that large dams have major environmental and ecological impacts. Some of these are listed below:
Upstream (including reservoir) (1) soil erosion; (2) micro-climatic changes; (3) loss of forests, flora, and fauna; (4) changes in floral and faunal density and diversity; (5) changes in fisheries, especially on spawning grounds; (6) chain effects on catchment area due to constructions, displacement, etc.; (7) landslips, siltation and sedimentation; (8) breeding of vectors in reservoir and increase in related diseases; (9) seismicity; (10) loss of non-forest land; (11) water logging around reservoir ; and (12) growth of weeds.
Downstream (including command area); (1) water logging and salinity; (2) reduced water flow and deposition in river, with related impacts on aquatic ecosystem, flora and fauna; (3) micro- climatic changes; (4) flash-floods; (5) salt-water ingress at river mouth; (6) changes in coastal ecosystem (e.g., mangroves); (7) loss of land fertility along river; and (8) vector breeding and increase in related diseases.
ఈ జవాబులో 20 పాయింట్లు ఉన్నాయి కదా! సాధారణంగా ఇది 20 మార్కుల ప్రశ్నగా రావొచ్చు. అంటే పాయింటుకో మార్కు ఉంటుందని వూహించవచ్చు.
రాత సాధన ఎందుకు అవసరం?
సివిల్‌ సర్వెంట్‌ పరిణతిని సూచించేలా రాయగలిగివుండాలి. వ్యాకరణ దోషాలు, అక్షరక్రమ (స్పెలింగ్‌) లోపాలు లేకుండా జాగ్రత్తపడాలి. పదాడంబరం పనికిరాదు. సందర్భ శుద్ధిలేని గణాంకాలను ఏకరువు పెట్టడం తగదు.
సివిల్స్‌కు అవసరమైన పుస్తకాలన్నీ చదివేసి వివిధ అంశాలపై పరిజ్ఞానం సంపాదించినవారు దాన్ని రాతపూర్వకంగానే అది కూడా నియమిత కాలవ్యవధిలో ప్రదర్శించాల్సివుంటుంది. అందుకు రాత సాధన చాలా ముఖ్యం.
కొందరు... మొదట అన్ని అంశాల్లో పరిజ్ఞానాన్ని సంపాదించేదాక వేచిఉండి, ఆ తర్వాత రాయడాన్ని సాధన చేయాలని సలహా ఇస్తుంటారు. ఇది అర్థరహితమైన వాదన. అన్ని అంశాల్లో అభ్యర్థికి ‘తగినంత’ పరిజ్ఞానం ఎప్పటికి లభిస్తుంది? మెయిన్స్‌ పరీక్షకు నెలరోజుల ముందా? రెండు నెలల ముందా? అప్పుడైతే రోజుకు 4-5 గంటల రాత సాధన అవసరమవుతుంది. మరి వార్తాపత్రికలు చదవటం, తయారు చేసుకున్న నోట్సు/ పుస్తకాలను పునశ్చరణ చేయటం, నమూనా పరీక్షలు రాయటం.. వీటికి సమయం ఎక్కడ ఉంటుంది?
అందుకే సమాధానాలను రాసే సాధన సన్నద్ధతతోపాటే కొనసాగాలి. అస్పష్టమైన అవగాహన ఉన్న అంశంపైన కూడా కొన్ని పాయింట్లను రాయగలిగేలా తయారు కావాలి. మెయిన్స్‌ పరీక్షలో ఒక రోజు సమయంలో 8000 నుంచి 10,000 కుపైగా పదాలను రాయాల్సి ఉంటుంది. కాబట్టి, ఒక నిర్ణీత సమయంపాటు రాయడాన్ని అలవాటు చేసుకోకపోతే పరీక్ష కేంద్రంలో చిక్కులు ఎదురవుతాయి.
అభ్యర్థుల రాతలు సివిల్‌ సర్వెంట్‌ పరిణతిని సూచించేలా ఉండాలి. వ్యాకరణ దోషాలు, అక్షరక్రమ (స్పెలింగ్‌) లోపాలు లేకుండా జాగ్రత్తపడాలి. పదాడంబరం, సందర్భ శుద్ధిలేని గణాంకాలను ఏకరువు పెట్టడం తగదు. ప్రముఖుల కొటేషన్లనూ, జాతీయాలనూ వాడేటప్పుడు వాటిని ఇష్టం వచ్చినట్టు మార్చకుండా యథాతథంగా ఇవ్వాలి. అడిగిన ప్రశ్నకు నిర్దిష్టంగా జవాబు రాయటం, రాసే విషయాన్ని అవసరమైన పేరాగ్రాఫులుగా విడగొట్టటం, పాయింట్లు కనపడేలా అమర్చటం.. ఇవన్నీ అభ్యర్థి ఆలోచనా క్రమంలోని స్పష్టతను సూచిస్తాయి.

Saturday, August 3, 2013

2013 సివిల్స్ ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల ||

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌‌ర్వీస్ క‌మిష‌న్ సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష - 2013 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. సివిల్ స‌ర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేష‌న్‌, ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌కు ఎంపికైన అభ్యర్థుల వివ‌రాల‌ను ఆగ‌స్టు 2న క‌మిష‌న్‌ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. మే 26న నిర్వహించిన ఈ ప‌రీక్షకు దేశ‌వ్యాప్తంగా సుమారు 10 ల‌క్షల మంది అభ్యర్థులు హాజ‌రయ్యారు. వీరిలో 10 వేల మంది డిసెంబ‌రులో జ‌రగనున్న మెయిన్స్ ప‌రీక్షకు అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 వేల మంది అభ్యర్థులు హాజ‌ర‌వ్వగా సుమారు 500 మంది మెయిన్స్‌కు అర్హత సాధించిన‌ట్లు అంచ‌నా. గ‌త ఏడాది కంటే ఈ సంఖ్య అధికంగానే ఉంద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ ఏడాది జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో క‌టాఫ్ మార్కులు 218 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. కేట‌గిరీల‌వారీగా క‌టాఫ్ మార్కులు ఓబీసీ 200, ఎస్సీ 186, ఎస్టీ 185, పీహెచ్1 160, పీహెచ్‌2 164, పీహెచ్‌3 111 గా ఉన్నాయ‌ని అంచ‌నా. ఈసారి ఫ‌లితాలు త్వర‌గా వెలువ‌డ్డాయ‌ని, మెయిన్స్ ప్రిప‌రేష‌న్‌కు కావాల్సినంత‌ స‌మ‌యం ల‌భించింద‌ని నిపుణులు చెబుతున్నారు. సివిల్స్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ద్వారా ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీస్ మెయిన్ ఎగ్జామినేష‌న్‌కు అభ్యర్థుల‌ను ఎంపిక చేసే విధానాన్ని ఈ ఏడాది కొత్తగా ప్రవేశ‌పెట్టారు. 


ఈనాడు సౌజన్యం తో...

Tuesday, June 11, 2013

ఇకపై సివిల్స్ మార్కులు కుడా ఆన్లైన్ లో...

                       ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసు పరీక్షలు(2012) రాసిన అభ్యర్థుల మార్కులను ‘యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్’(యూపీఎస్‌సీ) బయటకు విడుదల చేసింది. ఇలా అభ్యర్థుల మార్కులను బహిరంగంగా ప్రకటించడం దేశంలో ఇదే తొలిసారి. గత నెల వెలువడిన ఈ ఫలితాలతోపాటు, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థుల వివరాలను, మార్కులను కూడా తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
 
                       ఈ వివరాల ప్రకారం.. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన 1004 మంది అభ్యర్థుల్లో టాపర్(హరిత వి. కుమార్)కు 53 శాతం మార్కులు వచ్చాయి. 2,250 మార్కులకు హరిత 1,193 మార్కులు సాధించారు. రెండో స్థానంలో నిలిచిన వి.శ్రీరామ్‌కు 51 శాతం మార్కులు(1,149), మూడో స్థానంలో నిలిచిన స్తుతి చరణ్‌కు 51 శాతం(1,148) మార్కులు వచ్చినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసమే ఇలా మార్కులను వెల్లడిస్తున్నారని సిబ్బంది, శిక్షణ శాఖ అధికారి ఒకరు అన్నారు. ఇక నుంచి ఇలాగే మార్కులను ఆన్‌లైన్‌లో వెల్లడించేందుకు కమిషన్ నిర్ణయించుకుందని తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ.. యూపీఎస్‌సీకి నోడల్ విభాగంగా పనిచేస్తుంది.
 
 
- సాక్షి సౌజన్యంతో..

Friday, March 15, 2013

.::: Stay on Civils 2013 Notification:::. యూపీఎస్సీ 2013 నోటిఫికేషన్‌ నిలిపివేత

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కు సంబంధించిన 2013 సివిల్స్ నోటిఫికేషన్‌పై ఆందోళనలు చెలరేగటంతో కేంద్రం వెనక్కి తగ్గింది. నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించింది. ప్రాంతీయ భాషలకు విఘాతం కలిగేలా నిబంధనలు రూపొందించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రజల నుంచి ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Thursday, September 6, 2012

డిగ్రీ చదువు మధ్యలో ఉన్నవాళ్లు, ఒక సంవత్సరం ముందునుంచే ప్రణాళికా ప్రకారం సన్నద్ధమైతే సక్సెస్‌

ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఫారెస్ట్‌ ఆఫీసర్‌, సిబిఐ, ఇంటలిజెన్స్‌...మొదలైన ఉద్యోగాల్లో స్థిరపడాలని ఎంతోమంది కలలు కంటారు. నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో భారీగా ఖాళీలు ఏర్పడతాయి. కానీ వాటన్నింంటినీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయరు. ప్రమోషన్స్‌, డిప్యూటేషన్‌ లేదా అబ్సార్షన్‌..వంటి పద్ధతుల్లో అనుభవం గల ఆఫీసర్లకు పోస్టింగ్స్‌ ఇస్తారు. నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం పొందాలంటే మిగిలింది డైరెక్ట్‌ రిక్రూట్‌మెంటే ! యూనియన్‌ పబ్లిక సర్వీస్‌ కమిషన్‌, స్టాటికల్‌, ఎకనామికల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో నెగ్గటమొక్కటే కేంద్ర కొలువుకు దారి. ప్రతి ఏటా నిర్దిష్ట సమయంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్‌ లేదా సాధారణ డిగ్రీ చదువుతో ఈ పరీక్షలకు హాజరుకావొచ్చు. డిగ్రీ చదువు మధ్యలో ఉన్నవాళ్లు, ఒక సంవత్సరం ముందునుంచే ప్రణాళికా ప్రకారం సన్నద్ధమైతే సక్సెస్‌కు దగ్గరవుతారు. కేంద్ర స్థాయిలో జరిగే పలు పరీక్షలు రెండు విధాలుగా నిర్వహిస్తున్నారు. మొదటిది పోటీ పరీక్షలు. రెండోది ఎంపిక (సెలక్షన్‌) పద్ధతి.
ఆయా పోటీ పరీక్షలు, వాటి లక్ష్యం మొదలైన వివరాలు...
* సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ, మెయిన్స్‌)
* ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌
* కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌
* ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌
* ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీసెస్‌
* కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌
* సెంట్రల్‌ పోలీస్‌ సర్వీసెస్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ నియామకాలు)
* డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్స్‌ (గ్రేడ్‌ బి,ఐ-సెక్షన్‌) ఆఫీసర్లు/ స్టెనోగ్రాఫర్స్‌ నియామకాలు)
* జియాలజిస్ట్‌ ఎగ్జామ్‌
* నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీ ఎగ్జామ్స్‌ (ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జరుగుతాయి)
* స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌ (రెండేళ్లకొకమారు జరుగుతుంది)
రెండో పద్ధతి : ఎంపిక పద్ధతిలో నేరుగా నియామకాలు జరుగుతాయి. కేంద్రంలోని గ్రూప్‌-ఎ, ఎంపిక చేసిన గ్రూప్‌-బి పోస్టులకు ఈ పద్ధతి పాటిస్తారు. ఇందులో పోస్టుకు అవసరమైన అర్హతలు కలిగినవారిని ఉన్నత విద్యార్హత, అనుభవం ఆధారంగా ఎంపిక చేపడతారు.
వెబ్‌సైట్‌ : www.upsc.gov.in 
ఎస్‌ఎస్‌సి : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి)... కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ కార్యాలయాల్లోని రూ.10,500, అంతకంటే తక్కువ వేతన పరిధి కలిగిన గ్రూప్‌-బి పోస్టులకు, గ్రూప్‌-సి లోని అన్ని నాన్‌-టెక్నికల్‌ పోస్టులకు పోటీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
సివిల్స్‌ : దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని సరైన రీతిలో నడిపించాలని గట్టిగా కోరుకునేవారికి సివిల్‌ సర్వీసెస్‌ మంచి మార్గం. యుపిఎస్‌సి నిర్వహించే అత్యంత కఠినమైన, విస్త్రత పరీక్ష సివిల్‌ సర్వీసెస్‌. ఈ పరీక్ష రాసేవారికి ముందుగా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అయితే ప్రస్తుత సంవత్సరానికి పరీక్ష పాత పద్థతిలోనే కొనసాగుతుంది. అభ్యర్థులు ప్రధానంగా ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌, ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌, వాటి తర్వాత సర్వీసులైన గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి సర్వీసులలో ప్రవేశానికి సివిల్స్‌ పరీక్ష రాస్తారు.
మూడు దశలు : ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ...ఇలా మూడు దశల్లో సివిల్‌ పరీక్ష జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష ప్రతి సంవత్సరం సాధారణంగా మే 3వ వారంలో జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్‌ పరీక్ష. అనంతరం పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. సివిల్స్‌ను జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు నాలుగుసార్లు మాత్రమే రాసేందుకు అనుమతిస్తారు.
అర్హత : భారతీయుడై ఉండి, కనీసం ఏదైనీ డిగ్రీ పాసై ఉండాలి.
ఫీజు : రూ.50 సింగిల్‌ సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ స్టాంప్‌ (పోస్టాఫీసుల్లో లభ్యమవుతాయి) ద్వారా చెల్లించాలి.
ప్రిలిమినరీ : ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 150 మార్కులకు జనరల్‌ స్టడీస్‌, 300 మార్కులకు ఆప్షనల్‌ పేపర్‌లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు గంటలు సమయం. మెయిన్స్‌కు అభ్యర్థులను వడకట్టటమే ప్రిలిమ్స్‌ ప్రధానోద్దేశం. ఆ ఏడాది అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్యకు సుమారు 12 నుంచి 13 రేట్ల మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. ఆప్షనల్‌కు సంబంధించి ప్రిలిమ్స్‌కు జాబితాలో ఇచ్చిన 23 సబ్జెక్టుల్లో ఏదేని ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. జనరల్‌ స్డడీస్‌ పేపర్‌లో జనరల్‌సైన్స్‌, కరెంట్‌ ఈవెంట్స్‌ (జాతీయ, అంతర్జాతీయ అంశాలు), భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం, భారత, ప్రపంచ భౌగోళిక శాస్త్రం, భారత రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మెంటల్‌ ఎబిలిటిలపై ప్రశ్నలుంటాయి.
మెయిన్స్‌ : మెయిన్స్‌లో మొత్తం 9 పేపర్లుంటాయి. అన్నీ వ్యాసరూప పద్ధతిలో రాయాలి. ప్రతి పేపర్‌కూ మూడు గంటల సమయం కేటాయిస్తారు.
ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌ : అగ్రికల్చర్‌, యానిమల్‌ హజ్బెండ్రీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎటక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, జాగ్రఫీ, జియాలజీ, ఇండియన్‌ హిస్టరీ, లా, గణితం, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెడికల్‌ సైన్స్‌, ఫిలాసఫీ, ఫిజిక్స్‌, పొలిటకల్‌ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, స్టాటిస్టిక్స్‌, జువాలజీ, ఆంత్రోపాలజీ, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ, హిస్టరీ, మేనేజ్‌మెంట్‌, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, కింది భాషా సాహిత్యాల్లో ఏదేని ఒకటి-అరబిక్‌, అస్సామీ, బోడో, బెంగాలి, చైనీస్‌, డొగ్రి, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, గుజరాతి, హిందీ, కన్నడ, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మళయాళం, మణిపురి, మరాఠి, నేపాలి, ఒరియా, పాలి, పర్షియన్‌, పంజాబి, రష్యన్‌, సంస్కృతం, సంతాలి, సింధి, తమిళ్‌, తెలుగు, ఉర్దూ.
మెయిన్స్‌ పేపర్లు : 1.పేపర్‌-1 రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన ఏదేని ఒక భారతీయ భాష (300 మార్కులు)
2.పేపర్‌-2-ఇంగ్లీష్‌ (300 మార్కులు)
3.పేపర్‌-3-ఎస్సే (200 మార్కులు)
4.పేపర్‌-4,5-జనరల్‌ స్డడీస్‌ (ఒక్కో పేపర్‌కు 300 మార్కులు)
5.పేపర్‌-6,7,8,9 పైన తెలిసిన ఆప్షనల్‌ జాబితాలోని అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఏవేని రెండు సబ్జెక్టులు (ప్రతి సబ్జెక్టుకూ రెండు పేపర్లు. ఒక్కో పేపర్‌కు 300 మార్కులు)
అనుమతి లేని కాంబినేషన్లు : 1.పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ -పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
2.కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ-మేనేజ్‌మెంట్‌
3.ఆంత్రోపాలజీ-సోషియాలజీ
4.మ్యాథమెటిక్స్‌-స్టాటిస్టిక్స్‌
5.అగ్రికల్చర్‌-యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌
6.మేనేజ్‌మెంట్‌-పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
7.ఇక ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో...సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ వీటిలో ఒకటి కంటె ఎక్కువ సబ్జెక్టులను ఎంపిక చేసుకోరాదు.
8.యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌-మెడికల్‌ సైన్స్‌
ఇంటర్వ్యూ : దీనికి 300 మార్కులు. ఇందులో ఎంపిక చేసుకున్న ఆప్షనల్‌ సబ్జెక్టుపై అభ్యర్థి అవగాహన, ప్రాముఖ్యత కలిగిన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు, వ్యక్తిగత అభిరుచులను అంచనా వేస్తారు.

Saturday, May 5, 2012

2011 సివిల్స్ ద్వారా 910 మంది ఎంపిక..

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం నాడు విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో అమ్మాయిలే ప్రథమ, ద్వితీయస్థానాల్లో నిలవడం విశేషం. ఏఐఐఎంఎస్‌లో మెడిసిన్‌ చదివిన స్నేహా అగర్వాల్‌ జాతీయస్థాయిలో ప్రథమస్థానం కైవసం చేసుకుంది. ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఎం.ఏ చదివిన రుక్మిణి రియార్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రిన్స్‌ ధావన్‌ మూడో ర్యాంక్‌ సాధించాడు. 2011 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా మొత్తం 910 మంది కేంద్ర సర్వీసులకు ఎంపికవగా వారిలో 195 మంది మహిళలున్నారు. 420 మంది జనరల్‌, 255 బీసీ, 157 ఎస్‌సీ, 78 మంది ఎస్టీ కేటగిరి కింద ఎంపికయ్యారు.

కృష్ణభాస్కర్‌కు రాష్ట్రంలో ప్రథమ స్థానం
ఈ ఫలితాల్లో కృష్ణభాస్కర్‌ ఆలిండియా 9వ ర్యాంకు, రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించాడు. కృష్ణ భాస్కర్‌ సోదరుడు పార్ధసారధి భాస్కర్‌ 373వ ర్యాంకు సాధించాడు. వీరిద్దరూ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీపార్థసారధి భాస్కర్‌ కుమారులు.
Related Posts Plugin for WordPress, Blogger...